రంగారెడ్డి

గెలుపు బీజేపీదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెహిదీపట్నం, నవంబర్ 17: గెలుపు బీజేపీదేనని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. నాంపల్లి నియోజకవర్గం బీజేపీ అభ్యర్ధి దేవర కరుణాకర్ నామినేషన్ పర్వంలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. మాట్లాడుతూ దేశ ప్రధాన మంత్రి మోడీ చేసిన అభివృద్ధే బిజేపీ పార్టీ అభ్యర్ధులను ప్రజలు గెలిపిస్తారన్నారు. నాంపల్లిలో మజ్లీస్ చేసింది ఏమి లేదని, మతతత్వ పార్టీ అని, ఓట్లును దండుకోవడమే కాని, అభివృద్ధిలో మాత్రం చేసింది ఏమి లేదని అన్నారు. బీజేపీ అభ్యర్ధి దేవర కరుణాకర్ భారీ మోజార్టీతో గెలుపోందుతారని అన్నారు. నాంపల్లి నియోజవర్గం బీజేపీ పార్టీ అభ్యర్ధి దేవర కరుణాకర్‌కు ప్రజలు ఓటు వేసి గెలిపించాలని గోషామహెల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే టీ.రాజాసింగ్ అన్నారు. దేవర కరుణాకర్ నామినేషన్ వేసేందుకు శనివారం ఉదయం సీతారాంబాగ్ దేవాలయంలో శ్రీ రామచంద్రమూర్తికీ ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరారు.