రంగారెడ్డి

ఓయూలో కార్మికుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాచారం, నవంబర్ 19: ఓయూలో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదన్నారు. బకాయిలను విడదల చేయాలని వైస్‌చాన్సలర్‌కు వినతిపత్రం అందజేశారు. పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావంగా ఏఐఎస్‌ఎఫ్ నాయకులు ఆందోళన చేశారు. విద్యార్థి నాయకులు స్టాలిన్, లింగస్వామి, కార్మికులు పద్మ, సత్తేమ్మ, మంగ, యశోద పాల్గొన్నారు.
నిర్లక్ష్యంపై రాస్తారోకో
షాద్‌నగర్ రూరల్, నవంబర్ 19: అధికారుల నిర్లక్ష్య వైఖరితోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఫరూఖ్‌నగర్ మండలం లింగారెడ్డిగూడ పాత జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో చేస్తున్న విషయాన్ని పట్టణ సీఐ శ్రీ్ధర్ కుమార్ తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్థులకు నచ్చజెప్పారు.