రంగారెడ్డి

విద్యుత్ షాక్‌తో కార్మికుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుషాయిగూడ, జనవరి 22: ఇంటికి రంగులు వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి కార్మికుడు మృతి చెందాడు. కుషాయిగూడ సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం ఒడిస్సా రాష్ట్రానికి చెందిన విశ్వనాథ్ బెహ్ర(45).. నెహ్రునగర్ కాలనీలో ఇంటికి రంగులు వేస్తుండగా ప్రమావశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడిక్కడే మృతి చెందాడు. కార్మికుడు బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా నిర్వహించారు. పోలీసులు జోక్యం చేసుకోని ఇంటి యజమానితో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బంధువులు శాంతించారు.