రంగారెడ్డి

అన్నార్తుల ఆకలి తీర్చడం బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 14: అన్నార్తుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని చాటుకోవాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. గురువారం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఫీడ్ ద నీడీ కార్యక్రమంలో భాగంగా చందానగర్ డివిజన్‌లో, మాదాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ, కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్‌లలో పేదలకు ఆహార పొట్లాలు పంచిపెట్టారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, శేరిలింగంపల్లి జోన్ కమిషనర్ హరిచందన దాసరి, శేరిలింగంపల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ టీ.వెంకన్న, చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఆర్.యాదగిరి రావు, మాదాపూర్ కార్పొరేటర్ వాలిదాస్ జగదీశ్వర్ గౌడ్, చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి, కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్‌తో కలిసి మేయర్ పేదలకు ఆహారాన్ని అందించారు. కార్యక్రమంలో ఏఎంఓహెచ్‌లు డాక్టర్ కేయస్ రవి, డాక్టర్ బిందు భార్గవి పాల్గొన్నారు.