రంగారెడ్డి

ఇటుకబట్టీ కార్మికుల పిల్లలకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 22: రాష్ట్రానికి వలస వచ్చి ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని కలెక్టర్ లోకేష్ కుమార్ అన్నారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లోని ఇటుకబట్టీల వలస కార్మికుల బాలబాలికల సంక్షేమంపై ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగుళూర్‌లోని పీఎస్‌జీ కనె్వన్షన్ హాలులో శుక్రవారం అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్, రాచకొండ కమిషనర్ మహేశ్‌భగవత్‌లు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కార్మిక, రెవిన్యూ, విద్యాశాఖ, పోలీస్‌శాఖలకు చెందిన అధికారులు.. ఇటుకబట్టీల యాజమానులు, కార్మికుల పిల్లలతో అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ లోకేశ్‌కుమార్ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.