రంగారెడ్డి

సాహేబ్‌నగర్‌లో హనుమాన్ జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం: సాహేబ్‌నగర్ హనుమాన్ జయంతి ఉత్సవాలను పురస్కంచుకుని సాహేబ్‌నగర్‌లోని అభయ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం చక్కటి ఏర్పాట్లను నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. అభయ ఆంజనేయ ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ఫౌండర్ చైర్మన్ కొత్త శ్రీ్ధర్ గౌడ్ తెలిపారు. ఉదయం ఆంజనేయ స్వామికీ అభిషేకం, విశేష హోమం, సింధూర, ఆకుపూజలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను చేశామని గుర్తు చేశారు. సాయంత్రం స్వామి వారి సన్నిధిలో 10వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు శ్రీ్ధర్ గౌడ్ వెల్లడించారు. ఉత్సవాలకు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు ఉమేష్ గౌడ్, సునిత, కుమార్ గౌడ్, కోత్త శ్రీకాంత్ గౌడ్, సురేష్ గౌడ్, అమరేందర్ గౌడ్, రాజు గౌడ్, క్రాంతి గౌడ్, యంజాల భిక్షపతి, సురేష్ గౌడ్, అంజి పాల్గొన్నారు.