రంగారెడ్డి

నేటి నుంచి నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొడంగల్, ఏప్రిల్ 21 : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్లు వేయడానికి నేటి నుంచి అవకాశముందని ఎంపీడీవో మోహన్‌లాల్ తెలిపారు. ప్రభుత్వ ఉతర్వుల మేరకు మొదటి విడుతలో ఎన్నికలు జరగనున్నందున 22 నుంచి 24వరకు పోటి చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మండంలో జడ్పీటీసీ, 11 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయన్నారు. వేసిన నామినేషన్లకు 25న పరిశీలన, 26న అప్పీలు, 27న ఉపసంహరణ అనంతరం మే 6న ఎన్నిక జరగనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో సందర్భంగా కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండంలోని 26 పంచాయతీలలో జరిగే ఈ ఎన్నికకు 51 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్లు వివరించారు. అభ్యర్థులు స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు.