రంగారెడ్డి
సబిత రాజీనామా చేసే వరకు పోరాటం : భట్టి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 21 May 2019
మహేశ్వరం, మే 20: నియోజకవర్గ ప్రజలు సబితా ఇంద్రారెడ్డి పై ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపిస్తే మోసం చేసి పార్టీ మారారని శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసే వరకు కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటం చేస్తామని సీ ఎల్పీ నేత మల్లు భట్టివిక్రమర్క హెచ్చరించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలో రెండో రోజు సోమవారం మహేశ్వరం మండలంలో తుమ్మాలూర్ మ్యాక్, ఇమాంగూడ, తుక్కుగూడ, మహేశ్వరంలో వారు రోడోషో, బైక్ ర్యాలీలో పాల్గోని వారు మాట్లాడుతూ చేవేళ్లలో రిజర్వేషన్ కారణంగా సీటు రాకపోయినా ఆమె పై గౌరవంతో మహేశ్వరం నియోజకర్గం ఎమెల్యే సీటు ఇచ్చామన్నారు. తన స్వార్ధం కోసం పార్టీ మారడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.