రంగారెడ్డి

కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, మే 20: ఈ నెల 23 వ తేదీన పాలమాకులలోని రెసిడెన్షియల్ స్కూల్‌లో జరిగే లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ సందర్శించారు. భద్రత ఏర్పాట్లు, సీసీ కెమెరాలు, కౌంటింగ్‌కు సంబంధించిన అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌంటింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతలతో పాటు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ హరీష్, వికారాబాద్ జాయింట్ కలెక్టర్ అరుణకుమారి, డీ ఆర్‌వో ఉషారాణి, డిప్యూటీ కలెక్టర్ హరిప్రియ, రాజేంద్రనగర్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం ఆర్డీవోలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.