రంగారెడ్డి

వసతుల కల్పనకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, మే 25: చేవెళ్ల నియోజకవర్గం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి స్పష్టం చేశారు. చేవెళ్ల ప్రజలు తనపై ఎంతో అభిమానంతో ఓటు వేసి గెలిపించారని ప్రజల సమస్యల పరిష్కారానికి తోడు ఉంటానని తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి మొట్టమొదటి సారిగా రాజేంద్రనగర్ శాసనసభ్యుడు టీ.ప్రకాష్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల సందర్భంగా తన అభ్యర్థిత్వాన్ని బలపరిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ప్రజలకు కావాల్సిన అన్ని వసతుల కల్పనకు కృషి చేయనున్నట్లు తెలిపారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రజలు తనపై ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపించారన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను అందరినీ సమన్వయపరుస్తూ ముందుకు సాగాలని కోరారు. తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన చేవెళ్ల నియోజకవర్గం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
యువతిపై అత్యాచార యత్నం
కొందుర్గు, మే 25: యువతిపై అత్యాచార యత్నానికి పాల్పడిన యువకుడితోపాటు అందుకు సహకరించిన నలుగురు యువకులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు జిల్లేడు చౌదరిగూడ మండల ఎస్‌ఐ లింగం తెలిపారు. ఈనెల 21న జిల్లేడు చౌదరిగూడ మండల పరిధిలోని పీర్జాపూర్ గ్రామానికి చెందిన 21సంవత్సరాల యువతి పరీక్ష రాసి ఇంటికి వెళ్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడగా అందుకు సహకరించిన మరో నలుగురు యువకుల పై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లింగం తెలిపారు.