రంగారెడ్డి

ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూన్ 17: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అయేశ మస్రత్ ఖానమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. మాట్లాడుతూ ప్రజావాణిలో 89 ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు సిఫార్సు చేశామని, వారి స్థాయిలో పరిష్కారం కాకుంటే వెంటనే ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తేనే పాలనపై ప్రజలకు భరోసా కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి పద్మజ, ఆర్డీవో విశ్వనాథం ఉన్నారు.