రంగారెడ్డి

తాను మరణిస్తూ.. మరొకరికి ప్రాణదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనత్‌నగర్, జూలై 18: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ వ్యక్తి.. తాను మరణిస్తూ మరొకరికి ప్రాణదానం చేశాడు. కేపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉండే శివ రామరాజు(56) భవన నిర్మాణ వ్యాపారి. ఈనెల 12న తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కూకట్‌పల్లి వద్ద వెనుక నుంచి వచ్చిన ఓ ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో తలకు తీవ్రగాయమైన శివరామరాజును మొదట స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు వెంటనే మెరుగైన చికిత్సల కోసం కిమ్స్ ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా సూచించారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పూర్తిస్థాయిలో పరీక్షించిన వైద్యులు అతనికి చికిత్సలు అందించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రాజు బ్రెయిన్‌డెడ్‌కు గురైనట్టు నిర్దారించారు. అనంతరం అవయవదానం విశిష్టతను కుటుంబ సభ్యులకు వివరించగా.. దానం చేసేందుకు ముందుకు వచ్చారు. అతనికి శస్తచ్రికిత్స నిర్వహించి లివర్‌ను సేకరించి మరొకరికి అమర్చారు.