రంగారెడ్డి

భకి తశ్రద్ధలతో కావడి యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, జూలై 21: భారతదేశం అన్ని వర్గాల సమాహారమని ప్రణవభక్త సమాజం అధ్యక్షులు మోండ్ర నర్సింహ అన్నారు. ఆదివారం హైదర్‌గూడలో ఆంబియన్ స్పోర్ట్ కాలనీవాసులు, మార్వాడీ సమాజ్ ఆధ్వర్యంలో ఆంబియన్ స్పోర్ట్ నుంచి చిన్న అనంతగిరి శివాలయం వరకు కావడి యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రణవభక్త సమాజం సభ్యులు యాత్రలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు విలువ ఇవ్వాలన్నారు. మన దేశ సంస్కృతిని చాటే కార్యక్రమాలను తప్పకుండా స్వీకరించి వాటిని ఆచారించి భావితరాలకు మన సంస్కృతి, సంప్రదాయాలను చాటాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో అరవింద్ అగర్వాల్, గణేష్ అగర్వాల్, పంకజ్, దీపక్, ధర్మేందర్ అగర్వాల్, హజారిబాయ్, రాజేందర్ అగర్వాల్, సమాజం సభ్యులు ఎన్.మల్లారెడ్డి, ఎస్‌బీ హరినాథ్, బర్ల మల్లారెడ్డి, సనివెల్లి కృష్ణ, వసంత్ కుమార్, పీ.సుధాకర్ రెడ్డి, రాము పాల్గొన్నారు.