రంగారెడ్డి
గోల్కొండ కోటలో జెండావందనం రిహార్సల్స్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మెహిదీపట్నం, ఆగస్టు 14: స్వాంతత్య్ర దినోత్సవానికి చారిత్రత్మాకమైన గోల్కొండ కోట ముస్తాబు అయింది. ఆగస్టు 15న జెండాను ఎగురవేసేందుకు సీఎం కేసీఆర్ వస్తున్న సందర్భంగా రెండు రోజులుగా కోటలో రిహార్సల్స్ కొనసాగించారు. కోటలోని జాతీయ జెండాను ఎగురవేసే స్థలంలోని వివిధ శాఖల అధికారుల బృందం, పోలీసులు, విద్యార్థులు రిహార్సల్స్ నిర్వహించారు. పోలీసులు కవాతును నిర్వహించారు. గంట పాటు కార్యక్రమం నిర్వహించారు. గోల్కొండ కోటకు వెళ్లే రహదారిలో కూడా ఎలాంటి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. గోల్కొండ కోట వద్ద వీఐపీలకు పార్కింగ్ స్థలానికి కూడా కేటాయించారు.
స్వరాజ్నగర్ సమస్యలను పరిష్కరించాలి
ఉప్పల్, ఆగస్టు 14: పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని స్వరాజ్ నగర్లో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ వాణీ రెడ్డికి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మైసయ్య, కార్యదర్శి నాగభూషణం, అనీల్ రెడ్డి, చిత్తరంజన్ రెడ్డి, సాయిలు, ప్రభాకర్, శ్రీహరి, సత్యపాల్ రెడ్డి, శివ బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ముఖ్యంగా చెత్త చెదారాన్ని తొలగించి, పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని, అధ్వాన్నంగా రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరారు.