రంగారెడ్డి

అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఆగస్టు 22: జిల్లా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని జడ్పీ చైర్సన్ పీ.సునీతా రెడ్డి అన్నారు. గురువారం కోటపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వికారాబాద్ జిల్లాను అభివృద్ధిలో అన్ని జిల్లాల కంటే ముందు వరుసలో ఉంచేందుకు కృషి చేస్తానన్నారు. ప్రతి గ్రామంలో అందరు మరుగుదొడ్లు నిర్మించుకుని స్వచ్ఛ గ్రామాలుగా వర్దిల్లాలని సూచించారు. హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని అన్నారు. ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ వికారాబాద్‌లో పలు రైళ్లు నిలిపేలా కృషి చేస్తానని అన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ ఎం.ఆనంద్ పాల్గొన్నారు.
అతిసారతో ఒకరి మృతి
తాండూరు, ఆగస్టు 22: అతిసార వ్యాధితో బాధపడుతూ తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో వ్యక్తి మృతిచెందాడు. కరణ్‌కోట్ గ్రామానికి చెందిన శ్యామప్ప(60) నాలుగు రోజులుగా వాంతులు విరేచనాలతో బాధ పడుతున్నాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడని వైద్యులు వెల్లడించారు.