రంగారెడ్డి

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, నవంబర్ 16: అర్హులైన ప్రతి ఒక్కరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ సునితా రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంపీ రంజిత్ రెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కలిగించేలా అధికారులు ప్రచారం నిర్వహించాలని సూచించారు. సమావేశంలో వికారాబాద్, కోడంగల్, చేవెళ్ల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.ఆనంద్, నరేందర్ రెడ్డి, కాలె యాదయ్య, కలెక్టర్ అయిశ ఉన్నారు.
జాతర ఉత్సవాల్లో అన్నదానం
అనంతగిరిలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి కార్తీక మాస జాతర ఉత్సవాల్లో శనివారం చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ సునితా రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు వడ్డించారు.