రంగారెడ్డి

ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్, డిసెంబర్ 14: వెంకటాపురం డివిజన్‌లో సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు చెప్పారు. శనివారం స్థానిక కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్, మచ్చబొల్లారం కార్పొరేటర్ రాజ్‌జితేంద్రనాథ్, ఓల్డ్ బోయిన్‌పల్లి కార్పొరేటర్ ముద్దం నర్సింహా యాదవ్‌తో కలిసి అంబేద్కర్‌నగర్, లక్ష్మీనారాయణ కాలనీ, రాజీవ్ వీకర్ సెక్షన్, ఇందిరానగర్‌తో పాటు కానాజిగుడా - సుభాష్‌నగర్‌ల మధ్య నూతనంగా భూగర్భ డ్రైనేజీ పనులు పరిశీలించారు. ప్రతి కాలనీ, బస్తీలలో ప్రజల సమస్యలు పరిష్కరించటానికి అంచెలంచెలుగా కృషి చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని తెలిపారు. పాదయాత్రలో చంద్రశేఖర్, సదానందచారి, సుజాత,నాయకులు లక్ష్మీనారాయణ, బీఎన్ రమేష్, ప్రభాకర్, మెసిన్, ఫయాజ్, ఖలీల్, ముత్యాలు, ఈశ్వర్ గౌడ్ పాల్గన్నారు.