రంగారెడ్డి

అట్టడుగు కులాల సంక్షేమానికి పని చేసిన టీడీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, జనవరి 18: బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్ ఆశయాల సాధన కోసం కృషి చేయాలని టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. ఎల్బీనగర్ టీడీపీ సీనియర్ నాయకుడు, మల్కాజిగిరి పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో వనస్థలిపురం డివిజన్ పనామ చౌరస్తాలోని ఎన్‌టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమానినికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ హాజరై ఎన్‌టీఆర్ విగ్రహానికీ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రమణ మాట్లాడుతతతతూ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపాలిటి ఎన్నికలలో టీడీపీ అధిక శాతం కౌన్సిలర్లను దక్కించుకుని కీలక పాత్ర పోషించడం ఖాయమని చెప్పారు. టీడీపీ నాయకుడు ఎస్వీ కృష్ణ ప్రసాద్ నాయకత్వంలో ఎల్బీనగర్‌లో పార్టీ మరింత పటిష్టంగా తయారు అవుతుందని చెప్పారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సామ భూపాల్ రెడ్డి, వెంకట్ గాందీ, చిత్తలూరి వెంకటేశ్వర్లు, తాళ్ల శ్రీశైలం గౌడ్, బద్దం మహేందర్ గౌడ్, షేక్ సుభాని, గ్యారగోని ప్రవీణ్ గౌడ్, ముత్యాల సత్యనారయణ, కృష్ణవేణి, సంజీవ రెడ్డి, రమాకాంత్, శివరాజ్ పాల్గొన్నారు.
ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి
షాద్‌నగర్ రూరల్: పేదల పెన్నిధి స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీడీపీ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు అన్నారు. శనివారం ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెలుగు ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా ఇనుమడింప చేసిన ఎన్టీఆర్ సేవలు మరువ రానివని అన్నారు. మాజీ ఎంపీపీ చల్లా వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.