రంగారెడ్డి

యువత క్రీడా స్ఫూర్తితో మెలగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందుర్గు, ఫిబ్రవరి 20: యువత క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగుతూ అభివృద్ధి పథంలో పయనించాలని మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. గురువారం కొం దుర్గులో చత్రపతి శివాజీ యూత్ నిర్వహించిన కబడ్డీ టోర్నమెంటు కార్యక్రమంలో మాజీ మంత్రి అరుణ, బీజేపీ కోశాధికారి శాంతి కుమార్, బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్దన్ రెడ్డి పాల్గొన్నారు. క్రీడలు మనిషి ఉన్నతికి తోడ్పడతాయని, క్రీడలతో ఉన్నత శిఖరాలను అధిరోహించ వచ్చునని అన్నారు. నిత్యం ఆట పోటీలతో మనిషి ఆరోగ్యవంతంగా ఉంటారని అన్నారు. క్రీడలలో గెలుపోటములను క్రీడా స్ఫూర్తి తో తీసుకుని ముందుకు సాగితేనే అభివృద్ది చెందుతారని అన్నారు. బీజేపీ నేతలు కొప్పుల రవీందర్ రెడ్డి, దేపల్లె అశోక్ గౌడ్, ఎం.మధు, నరేందర్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, గుంటి నరేందర్, మనోహర్ రెడ్డి, శివరాం, యాదయ్య, తేజ శ్రీకాంత్, బాలు, ఆనంద్ పాల్గొన్నారు.