ఆంధ్రప్రదేశ్‌

రాజ్యసభకు సుజనా, సురేష్ ప్రభు, టిజి పేర్లు ఖరారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎపి నుంచి రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఎట్టకేలకు టిడిపి ఖరారు చేసినట్లు తెలిసింది. టిడిపికి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి, పార్టీ నాయకుడు టిజి వెంకటేష్‌లను బరిలో నింపాలని నిర్ణయించారు. ఒక సీటును తమకు కేటాయించాలని మిత్ర పక్షమైన బిజెపి విజ్ఞప్తిని టిడిపి అధినేత చంద్రబాబు అంగీకరించారు. కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభును ఎపి నుంచి రాజ్యసభకు పంపుతారు. నాలుగో స్థానానికి పోటీ చేసే విషయమై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఎంతమంది వైకాపా ఎమ్మెల్యేలు తమకు మద్దతు ఇస్తారో సరిగా అంచనా వేసుకుని నాలుగో సీటుపై ఓ నిర్ణయం తీసుకుంటారు. వైకాపా తరఫున ఇప్పటికే విజయసాయి రెడ్డి నామినేషన్ వేశారు. ఆయనకు వ్యతిరేకంగా వైకాపా ఎమ్మెల్యేలను సమీకరించగలిగితేనే నాలుగో సీటుపై టిడిపి ఆశలు నెరవేరుతాయి. తగినంత బలం లేకుండా నాలుగో సీటు కోసం ఆరాటపడితే తప్పుడు సంకేతాలు వెళతాయన్న దిశగానూ చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు సమాచారం.