ఆంధ్రప్రదేశ్‌

రూ.3 లక్షల శ్రీగంథం చెక్కలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, జనవరి 23: కర్నూలు జిల్లా నంద్యాల అటవీశాఖ అధికారులు శుక్రవారం రాత్రి రూ.3 లక్షల విలువచేసే శ్రీగంథం చెక్కలు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న మేఘన ట్రావెల్స్ ప్రైవేటు బస్సును తనిఖీ చేయగా అందులో రెండు సూట్‌కేసుల్లో ఉన్న 50 కిలోల శ్రీగంధం చెక్కలు లభించాయి. వీటిని తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నంద్యాల డిఎఫ్‌ఓ కార్యాలయంలో నిందితుడు, బస్సు డ్రైవర్‌ను విచారించారు. ఇంతలో నిందితుడు తప్పించుకుని పారిపోయినట్లు సమాచారం. కాగా గాజులపల్లె వద్ద ఓ వ్యక్తి రెండు సూట్‌కేసులతో బస్సు ఎక్కాడని, వాటిలో శ్రీగంధం ఉన్నట్లు తమకు తెలియని బస్సు డ్రైవర్ స్పష్టం చేశాడు. కాగా అటవీ సిబ్బంది కావాలనే నిందితుడిని వదిలిపెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.