విజయనగరం

రైతు సంక్షేమానికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఫిబ్రవరి 15: రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో టీడీపీ నాయకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆరా తీశారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం, నీరు చెట్టు, జలసిరి వంటి కార్యక్రమాల వల్ల రైతులకు సాగునీటి కొరత తీరనుందన్నారు. భూగర్భజలాలు పెంపొందడం వల్ల బోర్లను మంజూరు చేసినట్టు చెప్పారు. ఇక దళిత తేజం..తెలుగుదేశం కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందన్నారు. మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్‌ఎన్‌ఎం రాజు, కె.శివరామకృష్ణ పాల్గొన్నారు.