రంగారెడ్డి

బాలికపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిగి, ఫిబ్రవరి 22: బాలికపై ఇద్దరు కామాందుల కన్ను పడింది. సమయం కోసం ఎదురు చూసి వ్యవసాయ బోరు దగ్గర బట్టలు ఉతుకుతుండగా పొదల చాటుకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు.
సంఘటన పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇబ్రహీంపూర్ పంచాయతీ అనుబంధ తండాలో గురువారం వెలుగులోకి వచ్చింది. తండాకు చెందిన బాలికపై అదే తండాకు చెందిన సునీల్(21), శ్రీనివాస్(22) కన్ను పడింది. వీరు పరిగిలో ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నారు. బాలిక ఎప్పుడు ఎక్కడికి వెళ్తుందని గమనించారు.
మంగళవారం తండాకు సమీపంలో ఉన్న వ్యవసాయ బోరు దగ్గర ఒంటరిగా బట్టలు ఉతుకుతుండగా అక్కడికి వెళ్లారు. బాలికను లాగడంతో సునీల్‌పై చేయి చేసుకుంది. బాలికను బలవంతంగా పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. విషయం ఎవ్వరికీ చెప్పవద్దని చెబితే చంపేస్తామని బెదిరించారు. బాలిక ఇంటికి వెళ్లి మూభావంగా ఉండటంతో గమినించిన కుటుంబ సభ్యులు నిలదీశారు. గురువారం ఉదయం విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. పరిగి పోలీస్‌స్టేషన్‌లో తల్లితండ్రులు ఫిర్యాదు చేశారు. బాలికను తాండూరు జిల్లా ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నాట్లు సీఐ రంగ తెలిపారు.