రాష్ట్రీయం

సాగర్ పరిధిలో మెగా టూరిజం భూముల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపురిసౌత్, డిసెంబర్ 29: పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ సమీపంలో నాగులవరం పంచాయితీ పరిధిలో ఏర్పాటు చేయనున్న మెగా టూరిజం ప్రాజెక్టు భూములను మంగళవారం ముంబైకి చెందిన ఎస్‌ఎల్ గ్రూప్ అధినేత సుభాష్ చంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు పరిశీలించారు. విజయవాడ నుండి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్‌లో ఎస్‌ఎల్ గ్రూప్ చైర్మన్, అధికారులు సాగర్‌కు చేరుకున్నారు. సాగర్ పరిధిలోని మెగా టూరిజం ప్రాజెక్టుకు ఈ భూములు అభివృద్ధికి అనుకూలంగా ఉన్నాయన్నారు. ఈ భూముల మ్యాప్ నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును బుధవారం కలిసి అందచేయనున్నారు. ఈయన వెంట పర్యాటక శాఖ ఈడీ అమరేందర్, సమన్వయ కర్త రోషణ్, మాచర్ల తహశీల్దార్ ఫణీంద్రబాబు, ఆర్‌ఐ వెంకటేశ్వర్లు, సర్వేయర్ శ్రీనివాస్, విఆర్వో కాశీ ఉన్నారు. (చిత్రం) మెగా టూరిజం భూములను పరిశీలిస్తున్న ఎస్‌ఎల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర ప్రతినిధి బృందం