మెయిన్ ఫీచర్

ఆస్వాదయోగ్యమైన కవిత్వం కా(రా)వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏది తేలిక మార్గమో దాన్ని ఎంచుకొని దాన్ని తరించడానికి ఏర్పరుచుకున్న నేపథ్యాన్ని అనివార్య ప్రయోజకత్వంగా విశే్లషించుకొని బ్రతుకు సాగించటం స్వేచ్ఛా నాగరికతయొక్క వౌలిక స్వభావం. దీన్ని పరివ్యాప్తి చేయటంకోసమే కలాన్ని కంకణంగా ధరిస్తారు. తమనే వివిధ పాత్రలుగా మలచుకుంటారు. తమకనుకూలమైన తర్క వ్యాకరణ సంధి సూత్రాలతో తమని సమర్ధించుకుంటానికి (అ)పూర్వ రంగాన్ని ఏర్పరచుకుంటారు. ఇక్కడ వ్యక్తులచుట్టూ ధర్మం తిరుగుతూ వుంటుంది. దీనికి గుడిపాటి వేంకటాచలం ఆద్యుడైతే అతని అనునాయులు నిగిడింపు. ఇది పరిణిష్ఠస్వైరంగా పారంపర్య విన్యాసవౌతుంది.
ఆధునిక కాలంలో వచ్చిన ముతక కవుల్ని విసర్జించి చూడండి. ఎందుకంటే వారు కేవలం జాతి సామాజిక రాజకీయ పరిస్థితుల అక్రమ సంతానం. చారిత్రక ప్రాధాన్యత కోసమే పరితపిస్తారు తప్ప కవిత్వంకోసం మాత్రం కాదు. నేర్చుకొని చెప్పడానికి కావలిసిన సాహిత్య విలువలేవి వారికి లేవు. ఆ ‘‘శిక్షణ’’ను భరించలేరు. ఈ ధూర్తుల్ని మనం పుల్లతోకూడా ముట్టుకోరాదు.
ఈ రోజుల్లో మానవులందరికి తిండి, బట్ట, గూడు వుండాలన్నది సమర్ధనీయమైన సంగతమైన విషయమే. ఈ మాటతో ఎవరికీ ఏవిధమైన విప్రతిపత్తి ఉండరాదు. మనిషి సామాన్యావకాశాలకు కూడా దూరమయ్యాడంటే అది చాలా దురదృష్టకరమైన ఉపద్రవమే. ఏ విధమైన ఉపద్రవం రాకుండా వుండాలన్నదే వేదకాలంనుండి మానవజాతి మనుగడకు సార్వజనికమైన శ్రేయస్సుగా శాసనమైంది. ఋగ్వేదంలోని 10వ కాండ- 87వ అనువాకం 21వ సూక్తంలో ఈ విధమైన పరమేశ్వర ప్రవచనం వుంది. ఇచట కవి రాజుగా సంబోధించబడినాడు.
‘‘పశ్చాత్పురస్తాదధరాదుదక్తాత్ / కవిః కావ్యేన పరిపాహి రాజన్ / సఖే సఖాయ మజరోజరిమ్ణే గ్నే / మర్తాగ్‌ం అమర్త్యస్తం నః!! (ఋ.10-87-21)
‘ఓ రాజా! క్రాంతదర్శనుడవై కవియగు నీవు నీ కావ్యముతో నలువైపుల ఉపద్రవములనుండి కాపాడుము. సఖుడా! నీవు జరారహితుడవు. నీ తోడను, నీ కావ్యముల తోడను, సఖ్యమొనర్చు సఖుడవైన నన్నుగూడ జరారహితుగావింపుము. ఓ అగ్నీ నీవు అమర్త్యుడవు. మర్త్యులమగు మమ్ము అమర్త్యులగావింపుము.’ ఇచట కవి కర్తవ్యాన్ని ఔపదేశిక ధర్మాన్ని ఎంత ప్రామాణికంగా అభివ్యక్తం చేశాడో ప్రస్తుత కవులు- ముఖ్యంగా అభ్యుదయ ప్రగతిభావ, యోగులైన వర్తమాన కవులు గమనించాలి. ఈ అనుశీలనం జరగాలంటే వర్తమాన కవులనబడేవారందరూ పఠనశీలురు కావాలి. డొక్కశుద్ధిలేని కవిత్వ స్పర్శ చెప్పుల్లేని కాళ్ళకు అశుద్ధమంటినట్లే వుంటుంది. అశుద్ధం వారికాస్వాదయోగ్యమైతే కావచ్చు కానీ. పాఠకులకు ఎందుకీ అనర్థ ప్రారబ్ధ హింస? హింసా రిరంస?
సగటు మనిషి యొక్క సమాజ సంయుజం బద్ధమైనదే. ఈమాట ఎవరి వ్యక్తిగత సంపద కాదు; ఆస్తి అంతకన్నా కాదు. ఈ ‘‘శోషలిజా’’న్ని అందరు కవులు రాస్తునే వున్నారు. ఐతే కొందరు ‘‘ముర్రా-జెర్సీ’’ జాతి కవులు ఈ ‘‘శోషలిజ’’మేదో తమ స్వంత వాఙ్మయమని చెప్పటమే విచిత్రం. కొత్త విషయాన్ని స్పృశించే శక్తి- తాహతు వీరికి లేదన్నదే అసలు సంగతి. అసలది కవిత్వమా-అన్నదే చర్చనీయాంశం. వీళ్ళు ఏమి రాస్తున్నారో దాంతో ఎవరికీ వివాదం లేదు. ఉన్న పేచీ అంతా అసలది కవిత్వవౌనా కాదా అన్నదాంతోనే. ఈ ఒక్క ప్రశ్నకు- కోరుకున్న సమాధానం మాత్రం ఈ కవుల పాలిటి (దొంగ కవులు) మరణ వాఙ్మూలం. కవిత్వం రాజకీయ సిద్ధాంతాలకోసం చదవం. అలానే అయితే ఆ చర్చ వేరు. ఆ సందర్భం వేరు. కవిత్వం చెప్పాలంటే కవులు మాత్రమే కావాలి. దీనికి మొట్టమొదటగా ఆత్మశిక్ష కావాలి. అన్యధా శరణం నాస్తి. ‘‘ఆత్మశిక్షణ’’ లేని అక్షర మాల అయోగ్యుడి చేతిలోని అడిదమే. అంటే అసలుభావం ఏమిటంటే కవి వయో-జ్ఞాన సముపార్జితమైన లోకానుభవ పరిపాకం చేతనే అంటే అనుభూతి చేతనే ఉత్తమ ప్రయోజనాన్ని చేరగలడు. అట్లాకాక-నినాదం చేత- ఈర్ష్యచేత, దురద చేత బలాత్కృతుడై గొప్పకోసం ఎఱ్ఱరంగు పులుముకొని తానో ప్రతిబద్ధ (ష్యౄౄజఆళజూ) కవినని ఆర్భాటంగా ప్రకటించుకున్నాడంటే వాడు ‘‘పెద్ద దొంగ’’అని గుర్తించాలి.
ఈ వ్యాపార చోరుడు ఏం ప్రతిపాదిస్తాడు. కేవలం వస్తువుని. ఈ వస్తువు (వాస్తవ మానవ జీవన సామగ్రి) ఎప్పుడు ఎలా కళాత్మక స్వభావం సంతరించుకొని సాహిత్యంగా మారగలవు అనే ప్రశ్నకు సమాధానం సాధించటం అత్యంత ప్రధానమైన విషయం. ఈ విషయానికొచ్చేసరికి ముర్రా జాతి కవులు వౌనమే వహిస్తారు. నిజానికి వస్తువు శిల్పరహితంగా అందజేసినప్పుడు దాని లోతు; రహస్యము ఆ ఘాతము తీవ్రతర శక్తికోల్పోయి నీర్జీవం అయిపోయి కళాత్మక పరిధిలోకి రాదు. ఇదే విషయాన్ని గురించి ఒక మేధావి ఇలా అన్నాడు. ‘ఖఆ్ద జఒ ళశళ్ఘూ; జఆ జ్యూళఒ శ్యఆ ఇళ్యశ ఆ్య ౄళ ఘ్యశళ జఆ యతీశఒ ౄళ, ని జ్యూ శ్యఆ యతీశ జఆ. క ఔ్యఔళూఆక జఒ ఆ్దళ ఛ్యిౄ జ్య్దజఆ్ఘ జఒ ౄక ఒఔజూజఆఖ్ఘ జశజూజ్పజజూఖ్ఘజఆక.’’ ‘‘జీవన సత్యం సామాన్యమైనది. నాకు ఒక్కరికీ సంబంధించినది కాదు. నేను దానికి చెందినవాడ్నే కానీ- అది నాకు చెందినది కాదు. నాకు చెందినది నా ఒక్క శిల్పమే. శిల్పమొక్కటే నా ఆత్మగత వ్యక్తిత్వం’’ దీన్ని మన భరతుడో- భామహుడో- ఆనందవర్ధనుడో- ఆవకాయ శాస్త్రులో చెప్పలేదు. జర్మను దేశస్తుడు చెప్పాడు. ఇది ప్రమాణంగా అంగీకరించగలిగితే- వాస్తవ సాహిత్య తత్త్వప్రతిపాదన చేసిన తరువాత గూడా ‘‘ఎలా చెప్పాడో ముఖ్యంకాదు ఏది చెప్పాడో అదే ముఖ్యం’’ అనే వాళ్ళుంటే వాళ్ళని ఏంచేయాలో తెలుగు నేలలు తేల్చుకోవాల్సిన చారిత్రక సన్నివేశం ఇప్పుడేర్పడింది. సామాజిక చైతన్యం ముసుగు క్రింద ఊరేగుతున్న శిల్పరహిత అకవిత్వాన్ని. ఆ అకవిత్వం తాలూకు అశుద్ధాన్ని క్షాళనం చేయాలి. తెలుసుకోండి.
విస్తృత చైతన్య జ్వాలల్లో నిత్యమూ దగ్ధవౌతున్న కవి (కవి మాత్రమే) కి సామాజిక స్పృహ- వస్తువు అనేవి అసలు సమస్యేకాదు. కవి చేతనలో వస్తువునకు శిల్పానికి ద్వైతభావం లేదు. సామాజిక స్పృహకి ప్రత్యేక స్థితి వుండదు. కవి సృష్టిలో ఈ స్పృహలన్ని కలిసిపోయే వుంటాయి. కవి సాహిత్య చైతన్యం అన్ని చైతన్యాలను-స్పృహలను మింగి జీర్ణించుకున్న చైతన్యం. పౌరాణిక భాషలో చెప్పాలంటే సామాజిక స్పృహ- వస్తువు అనే వాతాపి- ఇల్వాలుల్ని మింగేసి ఒక్క త్రేన్పుత్రేన్చిన అగస్త్యుడు కవి అంటే. నినాదప్రాయమైన - కరపత్ర క్షుల్లకవర్గమైన క్రిమికీటకాలు మాత్రమే సామాజిక స్పృహ అనే చారిక మీద వాలుతూ వుంటాయి. అందులో కవిత్వమనే మాటే పూజ్యం. జనంలో జలకాలాడే రసతత్త్వానుభూతి ఎవరికి ఉండదో వాడు మాత్రమే పొలికేకలు పెడతాడు. జీవితం కవిని కుదిపే ఏ క్షణంలోనో- చక్కిలిగింత పెట్టే ఏ తరుణంలోనో- గుండెల్లో అగ్నిని రగిల్చే ఏ లగ్నంలోనో అతని దృష్టి అసామాన్య విన్యాసంతో వ్యత్యస్తవౌతుంది. అదే శబ్దానికి వచ్చే అసాధారణశక్తిగా అభివ్యక్తవౌతుంది. ఆ అనుభూతే కవి ఆంతరిక చైతన్యమై దృగ్విశేషంగా భాసిస్తుంది. ఒక శబ్దాన్ని వాక్యంలో భిన్నభిన్న స్థలాల్లో పెట్టటంచేత ఎలా ఆ వాక్యార్థ వైఖరి మారుతుందో రచనా మర్మజ్ఞులకే తెలుసు. ఏ కవుల శిల్పచారిమ మన మీద ఆశ్చర్యఘాతాలు విసురుతుందో- ఆ కవుల సృష్టియంతా ఈ సంవిధాన చాతుర్యం మీద ఆధారపడి నిర్మించబడిందే. మనం ఇప్పుడు ఆ విధమైన కవిత్వాన్ని ఆహ్వానించి అనుభవించాలి. అట్టి కవులున్నారా అన్నదే ప్రశ్న.
‘నిౄ ఔ్ఘఒఒజ్యశళజూ ఔ్యళఆక జఒ ఘశ ళ్ఘౄశ్ఘఆజ్యశ యచి ఆ్దళ య్ఘూౄ ఘశజూ జశఆళళషఆఖ్ఘ ఔ్ఘఆఒ యచి యఖూ శ్ఘఆఖూళ’’ అన్నాడు విలియం హెజ్లిట్- కవిత్వ స్వభావాన్ని గురించిన చర్చ సందర్భంగా చెబుతూ ‘‘ఆ స్వభావం చేతనే కవిత్వం యెప్పుడూ ప్రయోజనాత్మకంగానే వుంది మానవ చరిత్రలో; ప్రయోజనం అంటే సామాజిక ప్రయోజనమే’’(సామాజిక స్పృహ అంటే ఇదేనేమో ఆలోచించండి). ముఖ్యంగా ఈ దేశంలో (మరీ తెలుగుదేశంలో) అదే సాహిత్య చరిత్ర. కవిజ్ఞానైక జీవి. జ్ఞానైక జీవి అప్రయోజకుడౌతాడని అనుకోవటం అప్రయోజకుల సమష్ట్భివనే. మన చుట్టూ ఈగల్లా ముసిరేది ఈ అప్రయోజకులే కదా. ఇట్టివారినే మనం కవులుగా గుర్తించవలసిన దుస్థితి యేర్పడింది. వెనకటి కాలంలో ఈ చర్చ తలయెత్తలేదు. ఆ తరం డొక్కశుద్ధిని శంకించవలసిన అవసరమూ కలగదు. కారణం ఆ తరం కవులందరూ ధర్మోపదేష్టలు; కనుకనే రాజులు ప్రజలు కవుల్ని భక్తితాత్పర్యాలతో ఆదరించారు. అభినందించారు. ఆనందించారు. లోకజ్ఞత, మానవ తాత్సర్యం; (లోకజ్ఞత అంటేనే సామాజిక స్పృహ) విజ్ఞత, వైదుష్యం పరిపక్వదృష్టి, కరుణ, సత్య సంధత, ధైర్యం నీతి వున్నవాడే కవి ఈ లక్షణాలన్ని ఆ తరానికి చెందిన కవికి వున్న వన్నమాట. ఈ కవిని ఆనాటి సమాజం ఇంత గౌరవించటానికి కారణం కవి అన్నవాడికుండవలసిన యోగ్యత పూజీభూతంగా వాడికున్నదన్నమాట. ఇది ఏవీ లేని ఇవాల్టి చనుబాలకవిని ఈ సమాజం ఎందుకు గౌరవించాలో- గౌరవించాలని వాడెందుకనుకుంటున్నాడో విచిత్రంగా లేదూ?
అనాది ప్రసూతమైన మన (వేద)సాహిత్యమంతా దాని వస్తువంతా సాధారణంగా చరాచర విశ్వసృష్టిని గురించిన ఒక తత్త్వవిచారం. వాల్మీకితో ప్రారంభమైన లౌకిక వాఙ్మయమంతా ఒక ధర్మ విచారమే. దీన్ని గుర్తించటానికి కావల్సిన కనీస అర్హత కూడా లేని మహమహాకవులు ఒళ్ళంతా విషమే పూసుకొని వెఱ్ఱికామాన్ని వెలిచలిని వెలిగ్రక్కుతారు. వైదిక సాహిత్యమే కాదు ఈ దేశంలో తరువాతి కవులు ప్రపంచానికి బుద్ధిని దానం చేసినవారే. భర్తృహరి- నీలకంఠుడు, ఆఖరికి సుమతీ శతక కారుడు (వినదగు నెవ్వరు చెప్పిన అనే పద్యం మొత్తం షేక్స్పియర్ పామ్లెట్‌లో వాడుకున్నాడు) వీరంతా అట్టివారే. సాహిత్యం ఉపదేశయుక్తంగా వుండాలనే భారతీయమైన తత్త్వం ఇతర దేశస్థుల్లో కనిపించటానికి కారణం ఈ జాతి ఔదార్యమే. ఐతే ‘ఇంగ్లీషు’లో ఒక జాతి నిర్మించుకునే యోగ్యతలు వుండటం గమనించాలి. అందులో సమస్త ఆధునిక కాలమూ వుంది. సంస్కృతంలో సమస్త ప్రాచీన కాలమున్నట్లే. ఈ రెంటినీ కలిపి దేశ కాల అవిచ్ఛిన్నమైన మానవ సర్వస్వాన్ని దర్శించుకోవాలి జ్ఞాని అయిన ఆధునిక కవి, ముఖ్యంగా అభ్యుదయ (?)కవి. ప్రాచీనమైన భావాక్షర సంగతం కానిదేది ఆధునికంకాదన్న నిజాన్ని అంగీకరించలేనివాడు కవిత్వం జోలికిపోరాదు. ఈ సందర్భంలో ఇటీవల- ‘్జశ శ్ఘఆజ్యశ్ఘజచీజశ ఘశజూ ఔ్యఔఖ్ఘ్ఘూఛీజశ ఔ్యళఆక’’ అనే శీర్షిక క్రింధ ‘-్యళఆక చ్యఖూశ్ఘ’’ లో ‘దిఖత్యీ యూతీత్యీ’’ వ్రాసిన వ్యాసం చదవండి. చదివి తీరాలి. పాతదాన్ని పాత చింతకాయ పచ్చడి అని తీసిపారేసే అప్రగల్భ వీరశిఖామణుల మీద ఇది మరణాస్త్రం అదే కవి వేషం వేసుకున్న అయోగ్యుడా! స్వరూపం కాదురా కవిత్వం అంటే స్వభావం అని బల్లగుద్దిమరీ చెబుతున్న ‘‘గువో మోరువో’’ మాట వినరా అని అరిచి చెప్పాలనిపిస్తుంది. ఈ మాటే మన కాళిదాసు ఎప్పుడో చెప్పినట్లు గుర్తు. ఏతావాతా ఈ సమ్యగ్‌దర్శనం చేయలేని వాడికి కవిత్వపు కలాన్ని పట్టుకునే అర్హత అసలులేదన్న శాసనాన్ని శిరసా వహించాల్సిందే. అసలిదంతా ఒక అంతర్గతమైన శక్తిమీద నిలబడే కావ్యోత్పన్న యోగమనే నిజాన్ని ఆకళింపుచేసుకోవాలి. కనుకనే రుద్రట- రాజశేఖర ముమ్మట భట్టులు శక్తి అనే శబ్దాన్ని వాడారు. శక్తి అనే శబ్దంచేత అది ప్రయత్నేన శక్యమని వ్యంజితమయింది. కానీ ప్రతిభ అనే శబ్దం జన్మసంస్కార భావ సాంగత్యంచేత ముద్రితమైంది. దండి సమాధి పద్ధతిని మొదటి ప్రతిపాదించిన వాడైనా ప్రతిభ అనే శబ్దాన్ని వాడాడు. శక్తి అని సూటిగా చెప్పలేదు. ఐతే వీరందరికంటే ముందు అగ్నిపురాణం శక్తి అనే మాట వాడి అది ‘‘సుదుర్లభం’’ అని చెప్పింది. ‘‘నరత్వం దుర్లభంలోకే విద్యాతత్ర సుదుర్లభా, కవిత్వం దుర్లభం తత్ర శక్తిన్తత్ర సుదుర్లభా’’అనటం చేత అతి కష్టంమీద అది సాధ్యమేనని చెప్పింది. ‘‘ప్రయత్న అలభ్యం’’ అని అనలేదు. అది గుర్తుంచుకోండి నానీ నీనా కవులు. అంటే వెనక చెప్పిన తపస్సు- సమాధి పద్ధతుల చేత కవిత్వ హేతువైక శక్తి సాధ్యమనే సూచిస్తూ వుంది. అది ఒక అగ్ని పరాకాష్ఠ. ఆత్మశిక్షణ లేనివారు అందులో పడే మిడతలౌతారు. కనుక ఓ కవి శలభాల్లారా... కవి మొదట అనుభూతిని కళగా మార్చుకోవాలి. అంటే అభ్యాసం చెయ్యాలి. ఆత్మీకరణని కళగా అభ్యాసంచేయాలి. అభివ్యక్తిని కళగా అభ్యాసంచేయాలి. ఈ అవిచ్ఛిన్న అభ్యాస తంత్రంలో పడి జీవితమంతా ఒక తపస్సుఅయి కావ్యతంత్రంగా మారిపోతుంది. అందుకే కవిత్వం ముందు ఒక జీవన విధానం- అంతే కాని కేవల శబ్దరచనా వ్యాపారం కాదు కవిత్వమంటే.
ఇదంతా ఎందుకు? మాకు తోచింది వ్రాస్తాం- చదివి మాకొక మేకతోలు కప్పండంటే, అందుకు తగిన గుంపు ఏ కంచెల్లోనో మేతమేస్తూ వుంటుంది. వెతుక్కొని ఆ కంచెని చేరుకోండి. అంతేకాని కవిత్వం జోలికి మాత్రం పోకండి.

--సాంధ్యశ్రీ, 8106897404