సాహితి

సాహిత్య శిఖరాన్ని ప్రశ్నించే పిపీలికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పద్యనిర్మాణ వాస్తు శిల్పం ప్రారబ్ధవశాత్తు అప్రయోజకుల పాలబడ్డది. కవితాగుణం కొరవడ్డ పదప్రోతంలోకి శబ్దాలు అక్షరాలు ప్రవేశపెట్టబడ్డాయి. రూప విన్యాస వైఖరికి ఆస్వాదమయ్యాయి. దానికి తగ్గట్టు ఏవేవో కొత్త కొత్త పేర్లు తగిలించుకున్నాయి. అలానే అఘోరిస్తున్నాయి. ‘్ఛందస్సుల అశ్వహృదయం’ తెలియకుండానే కనీసం అందులో ప్రాథమిక పరిజ్ఞానమనే అర్హత కూడా లేకుండానే పితృపాదుడౌతున్నాడు. రాసింది కవిత్వం అవుతుందా అవదా అనే ఆలోచన లేకుండానే రాసిందంతా కవిత్వమనే పైత్య భ్రమతో దాన్ని ఏదో ప్రతిఫలితార్ధినిశ్రేణిగా విశ్వసించి ఎగబ్రాకుతున్నాడు. విధానం ఇది కాదంటే కనె్నర్ర చేస్తున్నాడు. కవిత్వం ప్రజల దగ్గరకెళ్లవలసిందేనన్నాడు. ఏ ‘ప్రజ’యైనా జీవితంలో ఎదురైన యదార్థాన్ని సాహిత్యంలో ఎదురైతే ఒప్పుకోడు. పాఠకునికి కావల్సింది కళానుగుణమైన సత్యం నగ్నసత్యం కాదు. ఈ సంగతి తెలిసి వ్రాస్తే వ్రాసింది కవిత్వం అవుతుంది. తెలియక వ్రాస్తే అకవిత్వమవుతుంది. తెలిసి కూడా తెలియక వ్రాస్తే వాతరామణీయం అవుతుంది. అసలు మనిషికి ‘సిగ్గు’ భూషణమనే సంప్రదాయ సిద్ధాంతం నాశనమై పోవడానికి కారణం అకవులు కవిత్వమనే పేర పిచ్చిగీతలు గిలకటం. కవిత్వాన్ని మానభంగం చేయడం. ఓ నాలుగు పాదాల (పాదాక్షర నియతి లేకుండానే) కుంటి రాతకు ఒక పేరుపెట్టి ‘అండపిండ బ్రహ్మాండంలోకి ఆంబోతు ఱంకె’ను వదిలినట్టు వదిలితే దాన్ని ఎందరో - ఎందుకో అందిపుచ్చుకుని కాగితం తడిపే అచ్చుపోస్తున్నారు. పసిపిల్లవాడు పక్క తడిపినట్టు ఇది కవిత్వమనే ‘లేబుల్’ తగిలించుకుని వీధి వీధి తిరుగుతోంది. ఇవి రెండు మూడు రూపాల్లో పోటా పోటీగా ప్రదర్శనశాలల్లోకి వస్తున్నాయి. ఈ పిల్ల సమేరీలకు వెన్ను చరుపుగా-చన్ను చేపుగా ముందు వెనక మాటల్ని పేజీలు పేజీలు గుప్పిస్తారు. ఇదో అద్భుతమైన ప్రచార సాధనంగా ఉపయోగపడుతున్నట్లుంది. ఇది మొదట మొదట ఒక ప్రవాహం. తరువాత పిల్లకాల్వ. ఆపై ఏమిటో తెలియదు. ఈ వమనం ఆగిపోతుంది. ఆ ఋతుశూల తగ్గిపోతుంది. కవి నిజంగా కవి అయినట్టయితే ఈ రూప చర్చల్లోకి దిగడు. ఎందుకంటే రూపచర్చ కవిత్వం కాదు కనుక. అందులో సృజనాత్మకత లేదన్నమాట. జ్ఞాపకానికి నిలువని ఏ రచన అయినా ఎన్ని పుస్తకాల వైశాల్యాన్ని సంతరించుకున్నాక కూడా ఒఠి నిరర్థకమైన శుష్క కాష్ఠమే. వ్యక్తికి సమాజానికి మధ్య ఉండవలసిన న్యాయ సంగత సమన్వయం సాధించడానికి కృషి చేస్తే మహానుభావులు కవులైతే వారు వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, విశ్వనాథ అవుతారు. ఒక పక్షి-ఒక స్ర్తి-ఒక మేఘం-ఒక మనిషి పైవారికి లో వెలుగుల్ని ప్రసాదించిన త్రరుూ విద్యాధి దేవతలు కాక మరేమవుతారు? వారు నిస్సంశయంగా వేదమూర్తులే. ఒక రాజకీయవాది జనాన్ని బాగా అనుభవిస్తాడు. అంత మాత్రం చేత వాడికి జనమంటే బాధ్యత ఉందనుకోరాదు. వాడు వ్యభిచరిస్తూ జనాన్ని ప్రేరేపిస్తాడు. అదే రాజకీయం. కానీ కవి అట్లాకాదు. కవి చేతన కావ్యాక్షరాల్లో సాక్షాత్కరించే పరాదేవత. అది కానట్టయితే- ఈ రాసేవాడికి ఆ రాజకీయ నాయకుడికి తేడా లేనే లేదు. ప్రముఖ ఫ్రెంచి కవి చార్లెస్ బోదివేర్ ఏమంటున్నాడంటే- ‘నిఆ జఒ శ్యఆ జ్పళశ ఆ్య ళ్పళూక యశళ ఆ్య ఆ్ఘరీళ ఇ్ఘఆ్ద జశ ఆ్దళ ౄఖఆజఆఖజూళఒ; ఆ్య ళశ్యీక ఆ్దళ ష్యూతీజూ జఒ ఘశ ఘూఆ’. ఇధి సాహిత్య స్పృహ ఎవరికుండాలో వారిని గురించి చెప్పిన మాట. ఎందుకంటే జనంలో జలకాలాడడం అనేది ఒక రసతత్త్వానుభూతి. పై పూత కాదు. సామాజిక స్పృహ అనే చౌకబారు నినాదాన్ని అక్షరాలకు దట్టించి వదిలే వాడికే రసతత్త్వానుభూతి కలగదు. కారణం వాడు కేవల వస్తు ప్రేమి. నిజానికీ దేశానికి ముఖ్యంగా తెలుగు దేశానికి కావాల్సింది సామాజిక స్పృహ కాదు-సాహిత్య స్పృహ. సాహిత్యాన్ని తెలుగు నేలమీది నకిలీ కవులు-నకిలీ విమర్శకులు హింసపెట్టి అపార్థానికి గురి చేసారు. నాలుగు నానీలో, ఐదు రెక్కలో, ఆరు హైకూలో అల్లి వాక్యాన్ని విరిచి పోగులు చేసి అనాదృతంగా దురదృష్టకరమైన వాతావరణంలోకి తోశారు. సాహిత్య చైతన్యం లేదా స్పృహ అంటే కూపస్థ మండూక దృక్పథంగా తేల్చిపారేశారు. ఈ భ్రాంతి తెలుగు సాహిత్య తనువు పాలిటి స్ఫోటకం. మాటల మశూచికమన్నమాట. ఇదంతా తెలిసి బొడ్డూడని కవి(పే)పితలు-మహా కవులు సైతం తమని చూసి అసూయ పడుతున్నారని తమని తాము ఓదార్చుకునే స్థితిలో పడ్డారు. ఈ నిష్కారణ కీర్తి కండూతి పీడితులు (వీరి పూర్వాశ్రమం యూనివర్సిటీలు) గంటకో పుస్తకాన్ని గంట కొట్టి మరీ విడుదల చేస్తారు. రూపచర్చ ముందు మాటగా ఓ సముద్రఖేల. పిప్పిమీది ఈగల్లా అనునాయులు. అసలీ క్షోభ ఎందుకేర్పడిందని ఓ క్షణం ఆలోచిస్తే అన్య వృత్తుల నాశ్రయించి బ్రతకవలసిన వారు కవిత్వాన్ని లోకువగా స్వీకరించారు. ఇక కవిత్వమెలా జనిస్తుంది.
‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే నెగిరిపోతే / నిబిడాశ్చర్యంతో వీరు / నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే / నిర్ధాక్షిణ్యంగా - వీరే..’ - ఇది శ్రీశ్రీ రాసిన ‘అః!’ అనే ఖండ కావ్యం. దీని ప్రేరణగా మరో కవిత వ్రాయవచ్చు. కానీ జరిగింది, జరుగుతున్నది యేమంటే ఓ దిక్కుమాలిన రూపంలో ఓనాలుగు పాదాలు అకవిత్వ దుర్వాయువుల్ని వెదజల్లాయి. చూడండి.
‘గెలిచిన రోజున / నెత్తికెత్తుకున్నారు / ఓడిన రోజున / నేలకేసి కొడుతున్నారు’. ఇంకొకడు మరికాస్త ముందుకు పోయి విచిత్ర వమనం చేస్తాడు. ‘ఓహో అంటే జీవితం / ప్చ్ అంటే నిస్పృహ / ఘుమ ఘుమ / వెలగపండు’ - ఉటంకింపుతో తెల్ల కాగితాన్ని పాడుచేయడం ఇష్టం లేక గానీ- లేకుంటే ఈ పైత్య ప్రకోపానికి ఓ విశాల వ్యాస పీఠమే కావాలి. ఇప్పుడీ కవిత్వం కేవలం శబ్దమయమైన చప్పుళ్ల దండోరా అయింది. అదొక్కటే కవిత్వం ఎట్లా అవుతుందిరా అంటే విన్నవాళ్లు చప్పట్లు కొట్టారు కదా అని సమాధానం. ఒక జాతి బట్టకట్టి బ్రతుకున్నదంటే దాని కంతకు ముందున్న హోమవేదిక ముఖ్య కారణమన్నది తెలిసి కూడా-కారణాన్ని ఇముడ్చుకోలేని దరిద్రం తెలుగు జాతికి దయ్యమై పట్టుకుంది. సంస్కృతం పట్ల తెలుగు కవులకున్నదీ హృదయమే. ఆ భాషపట్ల వారికున్న అసహనం ఇంత చేసింది. దేని కావ్యపరంపర తెలుగు భారతికి జన్మస్థానమో, దాని సాహిత్య సంపద ఆంధ్ర వాఙ్మయ మండలికి కాంతి భిక్ష పెట్టిందో ఆ సంస్కృతం ఛందశ్శిల్పానికి పునాదులు వేసినా శబ్ద గర్భాంతర్గత శాక్త జగత్తును త్రవ్వి తీసినా కవిత్వ తత్త్వ విచారంలో మాత్రం కవితాత్మ భావ బంధంలోనే ఉందని ఉద్ఘోషించింది. వక్రోక్తిని ప్రతిపాదించిన భామహ- హంతకులు గానీ- ఆ వరసలో తరువాత వచ్చిన జగన్నాధుడు గానీ చమత్కార జనక భావనా విషమార్థ ప్రతిపాదక శబ్దత్వం కావ్యమన్నారే కానీ కేవలం శబ్దం కావ్యమనలేదు. అయినా మన కవి వాచాలుడు మాత్రం శబ్దం పట్టుకు వ్రేలాడుతున్నాడు. వాడి వ్యాపార వ్యవహారానికి కేవల ‘శబ్దం’ ప్రాణాధార అర్ధవిభూతియై ఆయుఃకారకవౌతుంది. వట్టి శబ్దాలు కవిత్వం కాదురా బాబూ! ఇది తెలుగు జాతి యావత్తూ మొట్టమొదటగా తెలుసుకోవాల్సిన విషయం; కాదు పాఠం! బండరాళ్లకు వాటితో నిర్మితమైన దేవాలయాలేమిటో తెలియదు. వట్టి శబ్దమైనా అంతే! వాటికి వాటితో నిర్మించబడ్డ కవిత్వం ఏమిటో తెలియదు. శబ్దాలే కవిత్వమైతే కొత్త కొత్త ధ్వనులు-విన్యాసాలు-చమత్కారాలు సృష్టించబడలేవు. కనుకనే అజ్ఞానం చేత-అభ్యాస హీనత చేత శబ్దాలే కవిత్వమనే పాతాళ స్థాయిలో పడికొట్టుకుంటున్న మూర్ఖ పరంపర చేతుల్లో కేవలం శబ్ద వ్యాపారం జోరందుకుంది. కనుకనే వాక్యాల నడుం విరగొట్టి నిర్బంధంగా పోగులు పోసి ‘కుంచె ధారు‘లైన లాలాజల గీతా భాష్యకారులు శబ్ద వ్యాపారం చేయగలుగుతున్నారు. ఈ ప్రచార పర్వంలో శబ్దం-దృశ్యం రెండూ ప్రధాన పాత్రలు పోషిస్తున్నాయి. ఈ మధ్య నా మిత్రుడు (కవినామక) అతని వ్యాపారప్పని మీద సోమాలియా వెళ్లాడు. అక్కడ విమానాశ్రయంలో సంబంధిత అధికారులకు చూపడానికి ఇతని ప్రయాణానికి సంబంధించిన పత్రాలను చేత్తో పట్టుకు నుంచున్నాడు. అప్పుడు ఇతన్ని ఎవరో ఫోటో తీసారు. ఆ ఫోటో తెలుగు దినపత్రికల్లో ప్రచురించబడి దానికింద ‘్ఫలానా ప్రసిద్ధ కవి సోమాలియా విమానాశ్రయంలో అశేష జనాభ్యర్థన మేరకు తెలుగు కవితా గానం చేస్తున్న దృశ్యం’ అని అచ్చయింది. నేను ఎంత సంతోషించానో సోమాలియాలోని ప్రతి వారికి నా తెలుగు అభినందనలు తెలియజేసుకున్నాను. ఆకలి మరిచి ఆలకించారు. ఇప్పుడక్కడ శబ్ద నాట్యం జరిగిందనుకుంటే దాని ప్రకంపనలు తెలుగు నాట వ్యాపారాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుంటాయని భావించవచ్చు కదా. ఇది శబ్దం కవిత్వమైన దృశ్యానికి పరాకాష్ఠ. దృశ్యం కవిత్వమనే ‘భ్రాంతి మదాలంకార’ శే్లష్మ నిపాసం. సాధారణంగా కవి ప్రతి తరంలోను భాషాపరంగా అనుసరించే సంప్రదాయం పట్లగానీ-సాధించవలసిన పరిణామం పట్ల గానీ అనభివ్యక్తంగా ఒక వినూత్న సిద్ధాంతాన్ని తన హృదయంలో పాదుచేసుకుంటాడు. కవి మనస్సులో స్థిరపడే ఈ అభివ్యక్త సిద్ధాంతానికి దోహదకారులైన శక్తులేవంటే - ఒకటి, కవి వ్యక్తిగత అభిరుచి. రెండు, అతని కాలంలో ప్రచలితవౌతున్న ఆర్థిక, రాజకీయ సామాజిక విశ్వాసాలు; మూడు, జాతిలో మోసులు వారుతున్న తాత్త్విక సిద్ధాంతాలు, నాలుగు అన్నిటికీ మిన్నగా ఆ యుగధర్మంలో ప్రపంచింపబడుతున్న సాంకేతిక సమస్యలు. ఇవన్నీ కలిసి ఒక కవి బాణిని యాసని అభివ్యక్తి సాధనాలను నిర్ణయిస్తాయి. పదజాలంతో వినూత్నమైన అర్థాన్ని ప్రతిపాదిస్తాయి. భాషకు నూతన జవసత్వాలను చేకూర్చిపెడతాయి. ప్రతిభావంతుడైన కవి భావపరంగా భాషాపరంగా తనకు సాధ్యమైన సమస్తావకాశాలను వినియోగించుకుంటాడు. రూపకాలనన్నీ వాడుకుంటాడు. రూపం మీద దృష్టిపెట్టడు. రూపం తనంత తానుగా ఏర్పడిపోతుంది. ఇవేవీ లేనివాడు ఇంత శ్రమ పడలేని వాడు రూప చర్చను లేవదీసి దాన్ని ఆహారం చేసుకుంటాడు. ఇప్పుడు ఆంధ్ర దేశాల్లో తెలుగువాడు ఈ రూప చర్చలో కూరుకుపోయి, ఆ ఊబిలో బతుకుతున్నాడు. కొన్ని పదుల సంవత్సరాల క్రితం కొక్కొండ వేంకటరత్నం పంతులుగారు ‘వెండి-బంగారు’ అనే రూపాల్ని తయారుచేసారు. ఏమయ్యాయో తెలియదు. ఆ తరువాత గురజాడ వారు ‘ముత్యాల సరాలు’ తయారుచేసారు. వీటినడక తరలానికి అటు-వృషభ గతి రగడకిటుగా ఉంటుంది. దేవులపల్లి కృష్ణశాస్ర్తీ గారు ఈ ముత్యాల సరాల్ని కొన్ని వ్రాసారు కానీ ఎందుకనో పెద్దగా మోజుపడలేదు. ఆ సరాలలా పోయాయి. అసలు ప్రాచీన ఛందస్సుల్లో ఎన్నో రకాల గుణ, గణ భేదాలతో పద్యాలుండగా మళ్లీ ఈ గాలి పదాల సృష్టి ఎందుకో తెలియదు. ఏ రకమైన నియమ నిబంధనలు లేకపోవడమే వీటి ప్రత్యేక లక్షణమైతే-అంతే తొందరగా గాల్లో కలిసిపోతాయి. ఎందరు (వందల డజన్లు) ఈ తెలుగు కవిత్వాన్ని నాలుగారు లైన్లలో బంధించలేదు? ప్రతివాడు ఎవడికి వాడే ఓ మహాకవి. దాన్ని కుల, మత, ప్రాంత, రాజకీయాది ఆభరణ కారణాల చేత బలపరుచుకున్నారు. ఎన్ని దుకాణాలు వెలిసాయని..! ఎన్ని ఈ దేశపు వీధుల్లో తోరణాలు తీరాయని..! జీవితంలో నిమ్నోన్నతాలు మోసే యాత్ర చేసి, కన్నీటి కడలి నీది-శాస్త్రాల్లో కృత పరిశ్రముడై, క్షతగాత్రుడై, ఓ శిఖరమెక్కిన వాడ్ని కూడా -ఓ ‘కైకూ’ కవి ‘నువ్వెంత’..? అని ప్రశ్నించే నాగరికతననుభవిస్తున్నాం. ఈ విరూపహేవాకం బుద్ధిగా చదువుకోవాలని ఆశిద్దాం.

- సాంధ్యశ్రీ 8106897404