ఆంధ్రప్రదేశ్
నీటిని తరలిస్తున్నా నోరు మెదపని మంత్రులు!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 6 June 2016
హైదరాబాద్: అనంతపురం ప్రాంతానికి చెందాల్సిన నీటి వనరులను పొరుగు రాష్ట్రాల వారు తరలించుకుపోతున్నా జిల్లాకు చెందిన మంత్రులు నోరు విప్పడం లేదని కాంగ్రెస్ నాయకుడు శైలజానాథ్ విమర్శించారు. ఎంతసేపూ కాంగ్రెస్ను నిందించడం తప్ప టిడిపి మంత్రులు చేస్తున్నదేమిటని ఆయన ప్రశ్నించారు. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ ఓ కొత్త రాజకీయ విషసంస్కృతికి టిడిపి, వైకాపా నేతలు తెరలేపారని ఆయన అన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు తప్ప ఈ విమర్శల వల్ల ఒరిగేదేమీలేదన్నారు.