చిత్తూరు

శ్రీవారి సేవలో సైనా నెహ్వాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, డిసెంబర్ 25 : భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనానెహ్వాల్ శుక్రవారం శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆమె విలేకరులతో మాట్లాడుతూ రెండేళ్ల సుదీర్ఘ సమయం అనంతరం శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చానని తెలిపారు. ఈ ఏడాది కాలానికి ప్రపంచ నెంబర్ వన్ దక్కించుకోవడం చాలా సంతోషం ఇచ్చిందని ఇది ఆ దేవదేవుని ఆశీస్సుల వల్లనే తనకు లభించిన విజయంగా భావిస్తున్నానని తెలిపారు. ఇందుకు కృతజ్ఞతలు తెలిపుకునేందుకే తన తండ్రితో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నట్టు తెలిపారు. 2016వ సంవత్సరంలో రాబోయే ఒలంపిక్స్ భారత్ తరపున విజయం సాధించేందుకు ఆ దేవ దేవుడు ఆశీస్సులు అందించాలని, అలానే దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు.