ఆంధ్రప్రదేశ్‌

‘సాక్షి’పై పోలీసు కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: తప్పుడు కథనాలను ప్రచురించారన్న అభియోగంపై రాజమండ్రి పోలీసులు సాక్షి పత్రికపై కేసులు నమోదు చేశారని సమాచారం. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇటీవల ఆమరణ దీక్ష చేసినపుడు ఆయన ఆరోగ్యం గురించి రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్లకు భిన్నంగా సాక్షిలో వార్తలు రాశారన్న ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పుడు కథనాల వల్ల ప్రజానీకంలో లేనిపోని అనుమానాలు రేకెత్తే ప్రమాదం ఉందని, ఈ కారణంగా కేసులు నమోదు చేశామని పోలీసు వర్గాల భోగట్టా. ఈ కేసులకు సంబంధించి నేడో, రేపో ఆ పత్రికకు పోలీసులు నోటీసులు జారీ చేస్తారని తెలిసింది.