సంపాదకీయం

పాకిస్తాన్ ‘ఎన్నికలు..’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్‌లో రాజకీయ వైరుధ్యాలను వ్యవస్థీకరించడానికి అక్కడి సైనిక దళాల అధిపతులు దశాబ్దికి పైగా చేస్తున్న ప్రయత్నం ప్రస్తుతం జరుగనున్న సాధారణ ఎన్నికలకు నేపథ్యం. సైనిక దళాల వ్యూహానికి ఇతివృత్తం- భారత్‌పై వ్యతిరేకత! అందువల్ల పాకిస్తాన్‌లో తథాకథిత- సో కాల్డ్- ప్రజాస్వామ్య ప్రభుత్వాలు నడచిన సమయంలోను, నడవని సమయంలోను పాకిస్తాన్ సైనిక దళాల వారు మన దేశంలోకి జిహాదీ బీభత్సకారులను ఉసిగొల్పుతూనే ఉన్నారు. 1947 అక్టోబర్ నుంచి నడుస్తున్న కథ ఇది. పౌర ప్రభుత్వాలను సైనిక దళాల వారు, సైనిక దళాలను జిహాదీ స్వభావం ఉన్న మత నాయకులు నిర్దేశిస్తుండడం పాకిస్తాన్‌లోని ‘మత రాజ్యాంగ వ్యవస్థ’కు ప్రాతిపదిక! సైనిక ‘ప్రభుత్వం’ నిర్దేశించిన పరిధిలో మాత్రమే ‘పౌర ప్రభుత్వం’ అధికారాలను బాధ్యతలను వహించడం పాకిస్తాన్ రాజ్యాంగ వైచిత్రి... ఇలా సైనిక దళాలవారు నడిపిస్తున్న ‘ప్రజాస్వామ్య నాటకం’లో ఇది మరో ఘట్టం. పాకిస్తాన్ ‘పార్లమెంటు’- కేంద్రీయ శాసనసభ- నేషనల్ అసెంబ్లీ-కు ఎన్నికలు జరుగుతుండడం ఈ ఘట్టం.. 2008 నుంచి పాకిస్తాన్‌లో పౌర ప్రభుత్వం నడుస్తోంది, చట్టసభలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 2008లో కేంద్రీయ శాసనసభకు జరిగిన ఎన్నికల ప్రచార సమయంలో మాజీ ప్రధానమంత్రి బేనజీర్ భుట్టో హత్యకు గురైంది. ఆమె నాయకత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి ఆ తరువాత ఆమె భర్త అసఫ్ అలీ జర్దారీ నాయకత్వం వహించాడు. 2008లో జర్దారీ నాయకత్వంలోని పార్టీ విజయం సాధించింది. నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్’- పిఎమ్‌ఎల్- రెండవ పెద్ద పార్టీగా అవతరించింది. 2013 నాటి ఎన్నికలలో పీపుల్స్‌పార్టీ ఓడిపోయింది. నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని పార్టీ అధికారంలోకి వచ్చింది! ఈ గెలుపోటములను ‘సైనిక దళాలు’ నిర్దేశిస్తున్నాయి. సైనిక దళాలవారు బలపరచిన పార్టీ మాత్రమే విజయం సాధించగలదన్నది బహిరంగ రహస్యం. రాజకీయవేత్తలు- ప్రధానంగా ప్రధానమంత్రి పదవిని నిర్వహించినవారు, నిర్వహించగల సమర్ధత ఉన్నవారు, ఇతర ప్రముఖులు- అవినీతిపరులని నిర్ధారించడం సైనిక దళాల వ్యూహంలో భాగం. అందువల్ల ‘అవినీతిపరులు నిర్వహించే పౌర ప్రభుత్వాన్ని ఎప్పుడైనా తొలగించడానికి’ సైనిక దళాలకు వీలు కలుగుతుంది. ఈ రాజకీయవేత్తలు నిజాయితీపరులా? అవినీతిపరులా? అన్నది ప్రధానం కాదు! సైనిక దళాల నిర్దేశంతో న్యాయస్థానాలు నిర్ధారించినవారు అవినీతిపరులు! సైనిక దళాలు ‘్ఫలానా రాజకీయవేత్త అవినీతిపరుడు’ అని చెపితే న్యాయస్థానాలు అందుకు తలలు ఊపడం పాకిస్తాన్‌లోని విచిత్ర రాజ్యాంగ వ్యవస్థ. అందువల్ల పరవేజ్ ముషారఫ్, అసఫ్ అలీ జర్దారీ, నవాజ్ షరీఫ్ వంటివారు వివిధ సందర్భాలలో ‘అవినీతిపరులు’గా న్యాయ నిర్ధారితులయ్యారు! నవాజ్ షరీఫ్ ప్రస్తుతం అవినీతిపరుడుగా నిర్ధారణకు గురై జైలులో ఉండడానికి ఇదీ నేపథ్యం! 2013లో సైనిక దళాలకు నచ్చిన షరీఫ్ ఇప్పుడు నచ్చలేదు.. ఈసారి నవాజ్ షరీఫ్ ఎన్నికలలో పోటీచేయకుండా ‘సైన్యం’ ఇలా బహిష్కరించింది..
నవాజ్ షరీఫ్ కరడుకట్టిన మతోన్మాది, ప్రచ్ఛన్న బీభత్సకారుడు. పాకిస్తాన్‌లో రెండురకాల ‘జిహాదీ’లున్నారు. ప్రభుత్వేతరులు మొదటి తరగతివారు. వీరు ప్రత్యక్ష బీభత్సకారులు. రెండవ తరగతికి చెందినవారు సైనికులు, పోలీసులు, రాజకీయవేత్తలు, మత నాయకులుగా చెలామణి అవుతున్నవారు. వీరందరూ ప్రచ్ఛన్న- పరోక్ష- బీభత్సకారులు. ప్రత్యక్ష బీభత్సకారులను పరోక్ష బీభత్సకారులు మన దేశంలోకి ఉసిగొల్పుతుండడం చరిత్ర. భారత వ్యతిరేక నిష్ఠ పాకిస్తాన్‌లోని రాజకీయవేత్తల మనుగడకు ప్రధాన ప్రాతిపదిక! అందువల్ల ప్రతి రాజకీయ పార్టీ ‘జిహాదీ’లకు మద్దతునిస్తోంది. కానీ సైనిక దళాలు గద్దెనెక్కించదలచిన రాజకీయవేత్త ‘గొప్ప భారత వ్యతిరేకి’గా ముద్రపడుతున్నాడు. ‘సైనిక దళాలు గద్దెదించదలచుకున్న నాయకుడు’ భారతదేశం పట్ల మితిమీరిన మైత్రిని వహిస్తున్నట్టు ప్రచారం అవుతోంది! ఇదంతా నిజమని నమ్ముతున్న మన దేశంలోని మేధావులు ‘నవాజ్ షరీఫ్ మన దేశం పట్ల మైత్రిని పాటించడంవల్ల అతగాడికి పదవీచ్యుతి జరిగిందని’ విశే్లషణలను చేస్తున్నారు..
పాకిస్తాన్‌లో రెండు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. మొదటిది సైనికుల ప్రభుత్వం, రెండవది సైనికుల పరమోన్నత- పారవౌంటసీ- అధికారానికి లోబడి, మేకపోతు గాంభీర్యంతో ప్రజాస్వామ్య పాలనను అభినయించే పౌర ప్రభుత్వం. అందువల్లనే సైనిక అభీష్టం మేరకు గతంలో పౌర ప్రభుత్వాలు కూలిపోయాయి, మళ్లీ ఏర్పడ్డాయి. లియాఖత్ అలీఖాన్, జుల్ఫికర్ అలీ భుట్టో, బేనజీర్ భుట్టో, అసఫ్ అలీ జర్దారీ, యూసఫ్ రజా జిలానీ వంటివారు సైనిక దళాల అభిమానం- ప్లజర్- ఉన్నంతకాలం మాత్రమే పదవిలో ఉన్నారు, పదవీచ్యుతులయ్యారు. గత సంవత్సరం జూలైలో పాకిస్తాన్ సుప్రీం కోర్టు నవాజ్ షరీఫ్‌ను ప్రధాని పదవి నుంచి తొలగించడానికి ఇదీ నేపథ్యం. ఆయన ఎన్నికలలో పోటీచేయరాదని, ఎలాంటి రాజకీయ పదవిని చేపట్టరాదని కోర్టు నిర్దేశించింది! ఇప్పుడు గత ఆరవ తేదీన ‘అవినీతి నిరోధక’ న్యాయస్థానం వారు షరీఫ్‌కు పదేళ్ల జైలుశిక్షను విధించారు. ఇదంతా సైనిక వ్యూహంలో భాగం. పాకిస్తాన్ సుప్రీం కోర్టు సహా వివిధ న్యాయస్థానాలు సైనిక ‘నియంత’ల అభీష్టం మేరకు తీర్పులిస్తున్నాయి. ఇదీ పాకిస్తాన్ ప్రజాస్వామ్య స్వభావం. సైనిక ప్రభుత్వం వారు కొనే్నళ్లు స్వయంగా పాలిస్తారు, కొనే్నళ్లు పౌర ప్రభుత్వం చేత పాలింపచేస్తారు. 1998లో మన ప్రధాని అటల్ బిహారీ వాజపేయితో కలసి ‘్ఢల్లీ-లాహోర్’ బస్సు సర్వీసును అప్పటి పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ప్రారంభించాడు, వంచించాడు. కార్గిల్‌లోకి దొంగచాటుగా పాకిస్తాన్ సైనికులు చొరబడ్డారు. ఆ వంచన వ్యూహం బెడిసికొట్టింది! సైనిక నియంత పర్‌వేజ్ ముషారఫ్ షరీఫ్‌ను తొలగించాడు, నిర్బంధించాడు, దేశం నుండి వెళ్లగొట్టాడు! 2008లో షరీఫ్ పాకిస్తాన్‌లోకి తిరిగి రావడానికి కారణం అతని జిహాదీ స్వభావం. సైనిక దళాలలోని, జనంలోని మతోన్మాదులకు అతగాడు నచ్చాడు.. అందువల్లనే 2013లో మళ్లీ గద్దెనెక్కిన షరీఫ్ జమ్మూ కశ్మీర్‌లోకి జిహాదీ తోడేళ్లను నిరంతరం తోలించాడు. 2003 నాటి ‘కాల్పుల విరమణ’ ఒప్పందాన్ని ఉల్లంఘించి అధీనరేఖ వద్ద పాకిస్తానీ రేంజర్లు 2013 నుంచి నిరంతరం దొంగచాటు యుద్ధం చేస్తున్నారు...
అయినప్పటికీ సైనిక దళాలు షరీఫ్‌ను ఇప్పుడిలా-కోర్టుల ద్వారా- పదవీచ్యుతుడిని చేయడానికి కారణం ‘ఎక్కువ కాలం ఎవ్వరినీ ప్రధానిగా కొనసాగనివ్వరాదన్న’ వ్యూహం! షరీఫ్‌ను ఇలా జైలుకు పంపడం వల్ల అతగాడి పట్ల, అతని పార్టీపట్ల వోటర్లకు సానుభూతి కలుగవచ్చు. దీన్ని నిరోధించడానికై అతగాడికి జైలులో సుఖకరమైన తరగతిని కేటాయించారు. హఫీజ్ సరుూద్ 2008లో ముంబాయిలో భయంకర హత్యాకాండ జరిపించిన బీభత్స పిశాచి. అతగాడు ‘జమాత్ ఉద్ దావా’, ‘లష్కర్ ఏ తయ్యబా’వంటి బీభత్స సంస్థల నిర్వాహకుడు! సరుూద్ ప్రారంభించిన రాజకీయ పార్టీ ‘మిల్లీ ముస్లిం లీగ్’ కేంద్రీయ శాసనసభ ఎన్నికలలో నూట అరవై చోట్ల పోటీ చేస్తోంది. సైన్యం అనుమతించింది.. ఇరవై ఐదున ‘పోలింగ్’ జరుగుతుందట!