రాష్ట్రీయం

21, 28న వృద్ధులు, దివ్యాంగులకు.. శ్రీవారి దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 18: శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, ఐదు సంవత్సరాల లోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు టీటీడీ సంతృప్తికరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెలా రెండు సామాన్య దినాల్లో వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా జనవరి 21,28వ తేదీల్లో మంగళవారం వయోవృద్ధులు (65సంవత్సరాలు పైబడిన వారు), దివ్యాంగులకు 4వేల టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఉదయం 10గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2గంటలకు 2వేల టోకెన్లు, మూడు గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరుతోంది. ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజు 1400టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇక్కడ ఉదయం 7 నుండి ప్రారంభించి రెండు స్లాట్లకు సంబంధించిన టికెట్లను కేటాయిస్తారు. భక్తులు ముందుగా వచ్చి టికెట్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆ తరువాత ఉదయం 10గంటలకు, మధ్యాహ్నం 3గంటలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామి దర్శనం కల్పిస్తారు. ఐదు సంవత్సరాల లోపు
చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను జనవరి 22,29 తేదీల్లో బుధవారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1.30గంటల వరకు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఈ రెండురోజుల్లో సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరింది.