రాష్ట్రీయం

ప్రయాణికుల ఆదరణను పెంచుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: రాష్ట్రంలో ప్రయాణికుల ఆదరణను ఆర్టీసీ పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ సంస్థ ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ అభిప్రాయపడ్డారు. ఆదివారం 71వ గణతంత్ర దినోత్సవాలు బస్సు భవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ మాట్లాడుతూ ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మిక, ఉద్యోగులు బాగా పని చేయడంతో సంస్థ జాతీయస్థాయిలో అవార్డులు దక్కించుకుంటున్నదని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగులు, అధికారులు అనే బేధం లేకుండా కలసి పనిచేయడంతో ఆర్టీసీ ముందడుగు వేస్తోందన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఆర్టీసీ సిబ్బంది బోనస్ తీసుకునే స్థాయికి ఎదగాలన్నారు. చాలెంజ్‌గా పనిచేస్తే ఫలితం తప్పకుండా దక్కుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.