రాష్ట్రీయం

వేడుకగా శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 9: తిరుమల శేషాచలం అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒకటైన శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఆదివారం వేడుకగా జరిగింది. ప్రతియేటా మాఘమాసంలో పౌర్ణమినాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీరామకృష్ణ మహర్షి తపోబలంతో ఈ పుణ్యతీర్థాన్ని సృష్టించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీవారి ఆలయం నుండి అర్చకులు మంత్రోచ్ఛరణ చేసుకుంటూ ఊరేగింపుగా బయలుదేరి ఉదయం 10 గంటలకు శ్రీరామకృష్ణ తీర్థానికి చేరుకున్నారు. అక్కడ కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ్భగవానుల విగ్రహాలకు పాలు, పెరుగు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. రామకృష్ణ తీర్థానికి వెళ్లే భక్తులకు పాపవినాశనం డ్యామ్ వద్ద పొంగళి, ఉప్మా, సాంబారన్నం, పెరుగున్నం, పులిహోర పొట్లాలు, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. తీర్థం వద్ద టీటీడీ వైద్యవిభాగం ఆధ్వర్యంలో వైద్యశిబిరం ఏర్పాటుచేసి భక్తులకు మందులు పంపిణీ చేశారు. టీటీడీ ఇంజినీరింగ్, అటవీ విభాగాల ఆధ్వర్యంలో మార్గమధ్యంలో పలుచోట్ల భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా కొయ్య నిచ్చెనలు ఏర్పాటు చేశారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

*చిత్రం... తిరుమలలోని రామకృష్ణ తీర్థ ముక్కోటిలో శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణభగవానుల విగ్రహాలకు పూజలు నిర్వహిస్తున్న దృశ్యం