రాష్ట్రీయం

కన్నులపండువగా ఆదిదంపతుల రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి), ఫిబ్రవరి 23: మహా శివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని ఆదిదంపతులు సర్వాభరణాలు ధరించి భక్తకోటికి దర్శనమిచ్చేందుకు రథాన్ని అధిష్ఠించి నగరోత్సవానికి బయలుదేరారు. ఆదిదంపతులను కనులారా చూసి తరించటానికి భక్తులు ఆదివారం సాయంత్రం పాతబస్తీ కెనాల్ రోడ్ సెంటర్‌కు పోటెత్తారు. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం, శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానం, శ్రీ వసంతమల్లిఖార్జున స్వామి దేవస్థానం నుండి ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగింపుగా తీసుకొచ్చి కెనాల్ రోడ్‌లోని రథంపై ఉంచారు. శ్రీ కన్యకాపరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రథోత్సవ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ ద్వారకాతిరుమలరావు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. ముందుభాగంలో మహిళల కోలాటం, సంకీర్తన, భజనలు, పులి వేషాలు, ఆధ్యాత్మిక ప్రసంగం సాగుతుండగా స్వామివారి రథం బయలుదేరింది. కెనాల్ రోడ్ నుంచి ప్రతి సెంటర్‌లో భక్తులు స్వామివారికి అఖండ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. రథం సెంటర్ నుండి వినాయకుడి గుడి వరకు ఊరేగింపు సాగింది. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం తిరిగి రథం యథాస్థానానికి చేరుకుంది. రథోత్సవానికి ముందు దుర్గగుడి ఈవో ఎంవీ సురేష్‌బాబు, శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయ ఈవో సీహెచ్ హేమలతాదేవి, దుర్గగుడి సహాయ ఈవోలు సుధారాణి, ఎన్ రమేష్, బీ వెంకటరెడ్డి, సహాయ ఇంజనీర్ రమాదేవితో అర్చకులు ప్రత్యేక పూజలు చేయించారు. రథోత్సవాన్ని సత్రం కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు బీ హరేశ్వరరావు, లక్ష్మీప్రసాద్ పర్యవేక్షించారు.

*చిత్రం...విజయవాడలో ఆదివారం అశేష భక్తజన సందోహం మధ్య కొనసాగిన ఆది దంపతుల రథయాత్ర