రాష్ట్రీయం
గ్రూప్-2 మిగులు పోస్టులకు 7నుండి ఇంటర్వ్యూలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 3 March 2020
హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-2 రిక్రూట్మెంట్లో తొలి జాబితాలో మిగిలిపోయిన కొన్ని పోస్టులకు ఈనెల 7 నుండి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు పబ్లిక్ సర్వీసు కమిషన్ పేర్కొంది. పోస్టు కోడ్-12 ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, పోస్టు కోడ్-13 న్యాయశాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు మూ డో జాబితాను రూపొందించినట్టు కమిషన్ తెలిపింది. వీరికి ఈనెల 7 నుండి ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఇప్పటికే అందుకు సంబంధించిన సమాచారాన్ని అభ్యర్థులకు చేరవేసినట్టు కమిషన్ తెలిపింది. గ్రూ ప్-2 పరీక్షలు 2016 నవంబర్లో జరిగాయి. అందులో ఎంపికైన వారికి 2019 నవంబర్లో సర్ట్ఫికెట్ల పరిశీలన నిర్వహించారు. మొత్తం 439 పోస్టులకుగాను ఈ రిక్రూట్మెంట్ నిర్వహించారు.