రాష్ట్రీయం
కన్నుల పండువగా మలయప్పస్వామి తెప్పోత్సవం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 9 March 2020
తిరుపతి: తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు ఆదివారం బ్రహ్మాండ నాయకుడైన స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ఆదివారం రాత్రి శ్రీవారి పుష్కరిణిలో తెప్పపై విహరించారు. ఈ సందర్భంగా భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి భక్తిశ్రద్ధలతో స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. స్వామివారు తెప్పపై ఐదుసార్లు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులను కరుణించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయ్యర్ స్వామి, చిన్నజీయ్యర్స్వామి, ఈఓ ఏకే సింఘాల్, అదనపు ఈఓ ధర్మారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్ పాల్గొన్నారు.
*చిత్రం... తెప్పపై విహరిస్తున్న మలయప్ప స్వామి