జాతీయ వార్తలు
స్కూల్ వ్యాన్ను ఢీకొన్న రైలు: 8మంది చిన్నారుల మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 25 July 2016
లక్నో: కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద స్కూల్ వ్యాన్ను పాసింజరు రైలు ఢీకొనగా 8 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. యుపిలోని బడోహి జిల్లాలో సోమవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. ఓ ప్రైవేటు స్కూల్కు చెందిన వ్యాన్ 19 మంది విద్యార్థులతో వెళుతుండగా కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద వారణాసి-అలహాబాద్ పాసింజరు ఢీకొట్టింది. వ్యాన్ నుజ్జునుజ్జవడంతో 8 మంది పిల్లలు మృత్యువాత పడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పించారు. వ్యాన్లో వెళుతున్న వారంతా పదేళ్లలోపు పిల్లలే. రైల్వే ట్రాక్పై ముక్కలుగా పడి ఉన్న పిల్లల మృతదేహాలు, స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, టిఫిన్ బాక్సులు చూసి సమీప గ్రామాల వారు కంటతడి పెట్టారు.