జాతీయ వార్తలు
యుపి కాంగ్రెస్ సిఎం అభ్యర్థి షీలాదీక్షిత్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 14 July 2016
న్యూఢిల్లి:ఉత్తర్ప్రదేశ్లో వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఢిల్లీ మాజీముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పేరును అధిష్టానం ప్రకటించింది. ఆ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2014నుంచి యుపిలో కాంగ్రెస్ ప్రాభవం క్షీణించింది. కులాల సమీకరణలు ఎక్కువగా పనిచేసే యూపిలో బ్రాహ్మణులు, అగ్రకులాలు ఎక్కువే. వారి మద్దతు సంపాదించేందుకు బ్రాహ్మణవర్గానికి చెందిన షీలాదీక్షిత్ను కాంగ్రెస్ సిఎం అభ్యర్థిగా ప్రకటించింది. రెండురోజుల క్రితం పార్టీ అధ్యక్షుడిగా రాజ్బబ్బర్ను నియమించిన కాంగ్రెస్ సిఎం అభ్యర్థి విషయంలో చాలా లెక్కలు చూసి చివరకు షీలావైపు మొగ్గుచూపింది.