క్రీడాభూమి
ఇండోనేసియా మాస్టర్స్ సెమీస్కు శ్రీకాంత్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
* నిష్క్రమించిన సింధు
మలంగ్, డిసెంబర్ 4: ఇక్కడ జరుగుతున్న ఇండోనేసియా మాస్టర్స్ గ్రాండ్ప్రీ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో తెలుగుతేజం, టాప్ సీడ్ కిడాంబి శ్రీకాంత్ సెమీ ఫైనల్లోకి దూసుకుళ్లాడు. మరో వైపు మహిళల సింగిల్స్ విభాగంలో పివి సింధు వరస సెట్లలో పరాజయం పాలయి టోర్నమెంట్నుంచి నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో శ్రీకాంత్ మలేసియాకు చెందిన టెక్ ఝీ సూను 21-10,21-5 తేడాతో వరస సెట్లలో చిత్తుచేసి సెమీ ఫైనల్లో స్థానం సంపాదించాడు. కేవలం 24 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగిసింది. సెమీ ఫైనల్లో శ్రీకాంత్ ఇండోనేసియాకు చెందిన గింటింగ్ ఆంథోనీని ఎదుర్కొంటాడు. కాగా, మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఎన్నో ఆశలు పెట్టుకున్న పివి సింధు చైనాకు చెందిన బింగ్జియావో చేతిలో వరస సెట్లలో పరాజయం పాలయింది. తొలి సెట్లో గట్టి పోటీని ఇచ్చిన సింధు రెండో సెట్లో బింగ్జియావో ముందు నిలవలేక పోయింది.