ఆంధ్రప్రదేశ్
డబ్బులెపుడూ పాచిపోవు: సిద్ధార్థనాథ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 10 September 2016
దిల్లీ: ఎపి ప్రజలకు ప్యాకేజీ పేరిట రెండు పాచిపోయిన లడ్డూలను కేంద్రం ఇచ్చిందని జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్కల్యాణ్ చేసిన విమర్శలకు ఎపి బిజెపి ఇన్చార్జి సిద్ధార్థనాథ్ సింగ్ ఘాటుగా స్పందించారు. ‘డబ్బులెపుడూ పాచిపోవు.. రాజకీయ విమర్శలు చేసేముందు అధ్యయనం చేయాలి.. వాస్తవాలు తెలుసుకోవాలి.. ఎన్డిఎలో ఉండాలో లేదో పవన్ తేల్చుకోవాలి..’ అని ఆయన అన్నారు. ప్యాకేజీ వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదన్నారు. భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా అభివృద్ధి సాధ్యపడదన్నారు. ఎపిలో తమ పార్టీకి మంచి భవిష్యత్ ఉందన్నారు. అంతకుముందు ఆయన ఎపి బిజెపి నేతలతో కలిసి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.