శిప్ర వాక్యం

భారత్ విచ్ఛిన్నానికి కుట్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొదట రెడ్ ఇండియన్లు ఉండేవారు. ఆ తర్వాత రోడ్ల నిర్మాణానికి ఆఫ్రికా వంటి దేశాల నుండి నల్లజాతి వారిని రప్పించారు. ఉద్యోగ, వ్యాపారాల కోసం భారత్, చైనా, కొరియా తదితర దేశాలవారూ అమెరికా చేరారు. అమెరికా అధ్యక్షుడిగా అబ్రహాం లింకన్ ఉన్న కాలంలో శే్వత, శే్వతేతర జాతుల మధ్య సంగ్రామం తీవ్రస్థాయికి చేరింది. అమెరికా అధ్యక్షుడిగా ఒబామా విజయానికి నల్లజాతివారు కారణం. అమెరికాలో వర్ణ వివక్షలతో సంఘర్షణలున్నా అందరూ తమ దేశాన్ని ప్రేమిస్తారు. జాతి సంపద పెంచేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తారు. ఇది మన దేశంలో కనిపించదు. భారత్ దేశద్రోహుల అడ్డా, విచ్ఛిన్నకారుల స్వర్గం.
యుద్ధాలు సరిహద్దులలో మాత్రమే జరగవు. దేశం లోపల కూడా జరుగుతాయి. రాజ్ మల్హోత్రా రచించిన ‘బ్రేకింగ్ ఇండియా’ గ్రంథంలో ఆయన గణాంకాలు, సంఘటనలు సహా విదేశీయులు భారత్‌ను ఎలా ముక్కలు చేయాలని ప్రయత్నిస్తున్నారో వివరించాడు. కొంచెం పరిశీలనగా చూస్తే సమకాలీన సంఘటనలు అందుకు సాక్ష్యాలుగా కన్పడుతాయి. ముందుగా కేరళను తీసుకుందాం. ఈ రాష్ట్రంలో మాజీ సీఎంలు ఇఎంఎస్ నంబూద్రిపాద్, వి.ఎస్.అచ్యుతానందన్, ప్రస్తుత సీఎణ పినరయ్ విజయన్ కమ్యూనిస్టులు. ‘దేశభక్తులను హత్యచేయండి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బూటకం. ఎన్నికల ప్రక్రియ ఒక నాటకం’ అని విజయన్ ప్రకటించాడు. ఆయనకు చైనా నుండి ప్రత్యక్షంగా సాయం అందుతోందన్న ఆరోపణలున్నాయి. ఇక్కడ ఐసిస్ ఏజెంట్లు, వారి రిక్రూట్‌మెంటు సెంటర్లు ఉన్నాయి. ఇక తమిళనాడులో ‘ప్రత్యేక’ రాజకీయాలు దాదాపు వందేళ్లుగా నడుస్తున్నాయి. తమిళ జాతి వేరు, ఆర్య జాతి వేరు. రావణుడనే తమిళుణ్ణి శ్రీరాముడు అనే ఆర్యుడు వచ్చి జయించాడు. ఆర్యులు యజ్ఞాలు చేస్తారు, వేదాలను గౌరవిస్తారు. అందుకని ద్రవిడులు సంస్కృత భాషను గౌరవించకూడదు. వేదాలకు బదులు తిరువాయ్‌మొజి అనే ద్రవిడ వేదం సృష్టించారు. 1950లో అన్నాదురై అనే తమిళ నాయకుడు పాకిస్తాన్ వలె తాము తమిళ దేశం కోరుకుంటున్నట్లు జవహర్‌లాల్ నెహ్రూతో పార్లమెంటులోనే చెప్పాడు. ఆయన కోరుకుంటున్న ‘తమిళ ఈలం’లో శ్రీలంకలోని జాఫ్నా, కచ్చితీవు వంటి ప్రాంతాలన్నీ ఉన్నాయి. కంచి పీఠం పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతిని కంచి నుండి తరిమివేశారు. 1832లో తమిళనాడులో ఒక సంఘటన జరిగింది. ఈస్టిండియా కంపెనీ ఉద్యోగి వద్ద ఒక గుమాస్తా ఉండేవాడు. ఇతడు దస్త్రాలు చంకన పెట్టుకొని ఆఫీసరుతోబాటు వెళ్తున్నాడు. ఇంతలో ఒక మొదలియార్ ఎదురుపడ్డాడు. ఈస్టిండియా కంపెనీ ఉద్యోగితో మొదలియార్ కరచాలనం చేశాడు. ఈ బంట్రోతు కాళ్లపై పడి మొదలియార్ నమ్కరించాడు. ఈ సంఘటనకు కంపెనీ ఆఫీసర్ నివ్వెరపోయి ‘నా బంట్రోతుకు నీవు ఇంత గౌరవం ఎందుకిచ్చావు?’ అని అడిగాడు. ‘వీరు అయ్యంగార్ కుటుంబానికి చెందినవారు అంటే అనువంశికంగా మేము వీరికి శిష్యులం’అని చెప్పాడు మొదలియార్. అప్పుడు బ్రిటీషు ఆఫీసరు బ్రిటన్‌కు ఒక లేఖ వ్రాశాడు. ‘ఇక్కడ అయ్యర్, అయ్యంగార్ అనే శైవ, వైష్ణవ గురు పరంపరకు చెందిన కుటుంబాలున్నాయి. తమిళ ప్రజలు వారినే గౌరవిస్తారు. అందుకని ఈ సంప్రదాయాన్ని నిర్మూలించకపోతే మన రాజ్యం ఇక్కడ స్థాపన చేయటం కష్టం’ అని ఆ లేఖలో ఉంది. ఆ తర్వాత క్రమంగా ఇంగ్లీషు విద్యాభ్యాసం, ద్రవిడోద్యమం తమిళనాట వ్యాపించాయి. ఇది రామస్వామి నాయకర్ కాలంలో జరిగింది. రైల్వేస్టేషన్లలో ఇంగ్లీషు, తమిళం తప్ప హిందీలో బోర్డులు ఉంటే వాటి మీద తారు పూయించాడు. కావేరీ తీరంలో సూర్యునికి అర్ఘ్యం ఇస్తున్న వారిపై భౌతికదాడులు చేయించాడు.
ఇక కర్నాటక సంగతి చూస్తే- ఇక్కడ టిప్పు సుల్తాను పాలనలో లక్షల మంది అయ్యంగార్లు చంపబడ్డారు. శ్రీరంగం (తమిళనాడు), హూళిబీడు (కర్ణాటక)వంటి ప్రాంతాలను మాలిక్ కాఫర్ నేలమట్టం చేశాడు. ప్రస్తుతం వక్కళిగ, లింగాయత్ వర్గాల మధ్య అంతర్యుద్ధం నడుస్తున్నది. లింగాయతులు హిం దువులు కారు, వీరు ప్రత్యేకమైన జాతి అని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఖర్గే తాను బసవన్న శిష్యుణ్ణి అని చెప్పుకుంటాడు. 12వ శతాబ్దానికి చెందిన బసవన్న లింగాయత్ ధార్మిక గురువు, ఆడంబరాలకు అతీతంగా ఉండాలని చాటాడు. ఖర్గెకు విలాస భవనాలు, వందల ఎకరాల ఎ స్టేటు భూములు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్య్రోద్యమ కాలంలోనే జస్టిస్ పార్టీ బలంగా ఉండేది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో త్రిపురనేని రామస్వామి నేతృత్వంలో ద్రవిడోద్యమం నడిచింది. తెనాలి ప్రాంతంలో పండిత గోపదేవ్ రుద్రదేవ్ వంటివారు ‘కమ్మ పురోహిత’ వర్గాలను సృష్టించారు. మత గ్రంథాలను సంస్కృతంలోకాక తెలుగులో చదవాలని శాసించారు. ఫలితంగా ఇక్కడ బౌద్ధం, కమ్యూనిజం ప్రవేశించాయి. చాపకింద నీరులా క్రైస్తవీకరణ కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో జరిగిపోయింది. హిందువుల ఇళ్ళల్లో ఏసుప్రభువు, గౌతమ బుద్ధుడు, గురునానక్ వంటివారి చిత్రపటాలు కూడా ఉంటాయి. కానీ క్రైస్తవులు, కమ్యూనిస్టుల ఇళ్ళల్లో రాముడు, కృష్ణుడు, శివుడు వంటి దేవుళ్ల ఫొటోలే కాదు, భారతమాత చిత్రపటాలు కూడా ఉండడానికి వీలులేదు. కమ్యూనిస్టులు హిందూ సంస్కృతి మీద దాడిచేస్తారే కాని కైస్తవ, ముస్లిం సామాజిక వర్గాల జోలికి పోరు.
తెలంగాణలో 1323 నుండి 1948 వరకు ఇస్లామిక్ పరిపాలన సాగింది. అప్పట్లో ఇక్కడి హిందువులు గుడికట్టుకోవడానికి వీలులేదు. గణేశ ఉత్సవాలు, బతుకమ్మ పండుగలు చేసుకోకూడదు. భూస్వామ్య వ్యవస్థ బలంగా ఉండేది. ఒక్కొక్క సంస్థానాధీశునికి వేల ఎకరాల భూమి ఉండేది. వారు తమ ఆస్తులు కాపాడుకునేందుకు అసఫ్ జాహీ ప్రభువులకు అణిగిమణిగి ఉండేవారు. ఉర్దూ, పర్షియన్ భాషలకు తప్ప ఇక్కడ తెలుగుకు గౌరవం లేదు. వింధ్యకు దిగువ భాగాన గల భారతదేశం దాదాపు విదేశీ శక్తుల నియంత్రణలో ఉంది. ఇక్కడి ఎన్నికల ప్రక్రియను అమెరికా, బ్రిటన్, చైనా, పాలస్తీనాలు ప్రత్యక్షంగా నియంత్రిస్తున్నాయి. అరబ్బు దేశాల నుండి ఇస్లామీకరణకు, అమెరికా నుంచి క్రైస్తవ మతప్రచారకులకు భారీగా నిధులు అందుతున్నాయి.
కాగా, 2019 ఎన్నికలను ప్రభావితం చేసేందుకు బ్రిటీష్ ఎనలటికా అనే సంస్థ భారత్‌లోకి ప్రవేశిస్తోంది. భారత్‌ను ముక్కలు చేయండని ఢిల్లీ విశ్వవిద్యాలయ కమ్యనిస్టు విద్యార్థి సంఘం నాయకుడు కన్నయకుమార్ చేసిన నినాదాల వీడియోలు గతంలోనే టీవీ చానళ్లలో విడుదల అయినాయి. కాశ్మీరును భా రత్ నుండి విడదీయండని ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రవేశించి కాశ్మీరీ ఉగ్రవాదులు నినాదాలిస్తే వారికి స్థానిక ప్రొఫెసర్లు మద్దత్తునిచ్చి నేరస్థులను తమ ఇళ్ల ల్లో దాచిపెట్టారు. ‘బ్రాహ్మణ వైశ్య క్షత్రియులను చం పండి’ అని మాయావతి, భగోరియా వంటి ఉత్తరప్రదేశ్ నాయకులు పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీని కాల్చి చంపండని సమాజ్‌వాదీ పార్టీ నాయకులు బహిరంగ సభల్లో కోరుతున్నారు. వీరు పాకిస్తాన్ ఉగ్రవాదులు కాదు. భారతీయ పౌరులు. ఇండియన్ ఆధార్ కార్డులు, పాస్‌పోర్టులు వీరికి ఉన్నాయి. మరి భారత రాజ్యాంగం వీరికి వర్తించదా? ‘మీకు స్వాతంత్య్రం వద్దు.. ఇచ్చినా దాన్ని నిలుపుకోలేరు, పరస్పరం కొట్టుకుని చస్తారు’అని 1947కు ముందు బ్రిటీషు ప్రధాని చర్చిల్ అన్న మాటలు గుర్తుచేసుకోండి. తెలంగాణలో రెడ్డి, వెలమ కులస్థుల మధ్య పోరు తీవ్రమయింది. సీమాంధ్రలో రెడ్డి-కమ్మ-కాపు కులస్థులు రాజ్యాధికారం కోసం కత్తులు దూసుకుంటున్నారు. ‘ఓట్లుమావి- సీట్లు మీవి- ఇది చెల్లదు’ అంటూ దళితోద్యమ నాయకులు దేశవ్యాప్తంగా ఆందోళనలు, బంద్‌లు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సైద్ధాంతికంగా కమ్యూనిజం అంతరించినా భారత్‌లో మాత్రం కొందరు వామపక్ష నేతలు ‘దండం పెడతాం.. లేదంటే దండం (ఆయుధం) పడతాం’ అని గతంలోనే ప్రకటించారు.
ఈశాన్య భారతంలోని నాగాలాండ్, మేఘాలయ, అరుణాల్‌ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో క్రైస్తవీకరణం పూర్తిగా జరిగిపోయింది. ఈ రాష్ట్రాలు తాము భారత్‌లో అంతర్భాగం అని అనుకోవటం లేదు. టిబెట్ సహా సిక్కిం, భూటాన్, అరుణాచలప్రదేశ్‌లను చైనా ఏక్షణంలోనైనా తమ దేశంలో కలిపివేసుకోవచ్చు. కాశ్మీరును తమ దేశంలో కలిపేస్తామంటూ పాకిస్తాన్ బహిరంగంగానే ప్రకటించింది. ఇక భారతదేశాన్ని ఎవరు రక్షిస్తారు? ఆఫ్రికాలో తెల్లవారి దుర్మార్గాలను భరించలేక అక్కడి నల్ల క్రైస్తవులు జీసస్‌ను నల్లరంగులో చిత్రీకరించారు. ఇది భారతీయ క్రైస్తవులకు కనువిప్పు కావాలి. ఎందుకంటే అమెరికా,బ్రిటన్, ఆస్ట్రేలియాలో హిందువులు అంటే నీగ్రోలు, బానిసలు అని భావిస్తారు. ‘లవ్ జీహాదీ’ పేరుతో హిందూ కన్యలను అరబ్ ప్రేరేపిత ముస్లిములు ఎత్తుకుపోతుంటే ‘కట్నం ఇవ్వటం తప్పింది కదా’ అని కొందరు యువతుల తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు.
బీఆర్ అంబేద్కర్ గొప్ప దేశభక్తుడని వేరే చెప్పనక్కరలేదు. అంబేద్కర్ పేరు మీద సూడో అంబేద్కరిజం ప్రచారంలోకి వచ్చింది. ఇది అమెరికన్ ప్రేరేపిత క్రైస్తవీకరణం. దీనిని ఎంతమంది గమనించారు? భారత్ నేడు ఒకేసారి విభిన్న దేశాల దాడిని ఎదుర్కొంటున్నది. అరబ్బులు పెట్రోడాలర్లు ఉపయోగించి జీహాదీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. చైనా బహిరంగంగానే మావోయిస్టులకు మారణాయుధాలను అందజేస్తున్నది. బ్రాహ్మణుల పిలకలు పంది తోకల్లా ఉంటాయని క్రైస్తవ మత ప్రచారకుడు కంచె ఐలయ్య బహిరంగంగా పుస్తకం వ్రాసి పంచిపెడితే, బాధితులు మాత్రం- కర్మ సిద్ధాంతం వల్లిస్తున్నారు. గతంలో హిందువులను ఆకర్షించడానికి ఒక ముస్లిం తన పేరును దిలీప్‌కుమార్ అని పెట్టుకున్నాడు. ఒకామె మీనాకుమారి అని పేరు పెట్టుకున్నది. ఇవ్వాళ బాలీవుడ్‌లోని ‘ఖాన్’ త్రయం హిందువులకు ఆరాధ్యదేవతలు. ఈ సినీహీరోలు జింకలను చంపినా, తప్పతాగి మనుషులను వాహనాలతో ఢీకొట్టినా తప్పులేదు.
ఇండియాను ముక్కలు చేసేందుకు నార్త్ అమెరికా ప్రేరణతో ఎవాంజలిజం చైనానుండి మావోయిజం, అరేబియానుండి జీహాదీ ఇజం ఇండియాలోకి ప్రవేశించినా భారతీయుల నుండి ఎలాంటి ప్రతిఘటన లేకపోవటం ఆశ్చర్యకరం అని ‘బ్రేకింగ్ ఇండియా’ గ్రంథంలో పరిశోధకుడు రాజీవ్ మల్హోత్రా పేర్కొన్నాడు. రాజకీయ లబ్ధి కోసం తెలుగుజాతిని సోనియాగాంధీ రెండు ముక్కలు చేసినా అనుకున్న రాజకీయ ఫలితాలు సాధించలేకపోయింది. అందుకు కాంగ్రెసు అగ్ర నాయకులు ఇప్పుడు బహిరంగంగానే బాధపడుతున్నారు. 1947లో భారతదేశాన్ని మతం ప్రాతిపదికపై ఇండియా-పాకిస్తాన్‌లుగా విభజించి ఏం సాధించారో కాంగ్రెస్ నేతలు చెప్పాలి. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్, నేపాల్, శ్రీలంకలను సాంస్కృతికంగా కలిపేందుకు ఎవరైనా ప్రయత్నం చేశారా?- చెప్పండి? దేశాన్ని ఏదో ఉద్ధరిస్తారని జనం భావిస్తున్న నరేంద్ర మోదీ లాంటి నేతలు సైతం ‘అఖండ భారత్’ అనే మాటను మరచిపోయారు.

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040- 2742 5668