శ్రీకాకుళం

తల్లికి మించిన దైవం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలుమూరు, జనవరి 22: తల్లిప్రేమకు మించిన దైవం లేదని ప్రతీ విద్యార్ధిణీ, విద్యార్ధి తల్లికి గౌరవించి పూజించాలని ఎంపిడివో వాసుదేవరావు అన్నారు. ప్రభుత్వ బాలికల హైస్కూల్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మకు వందనం కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. తల్లిని నిత్యం దేవతగా పూజించాలని తరతరాలు, యుగయుగాల నుంచి స్ర్తి ప్రాముఖ్యత గురించి ఆయన వివరించారు. ఇటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టడంతో విద్యార్ధుల్లో మార్పు వస్తుందని ఆయన స్పష్టంచేశారు. ఎం ఈ వో మాధవరావు, హెచ్ ఎం సీతారాం, బాలుర హెచ్ ఎం లక్ష్మణరావులు మాట్లాడారు. పలువురు తల్లులకు పిల్లలు పాదాలు కలిడి పూజలు చేపట్టారు. బగ్గు గోవిందరావు, టీడీపీ నేత తారకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీముఖలింగం, అచ్యుతాపురం, రాణ కార్యక్రమం ఘనంగా జరిగింది.