శ్రీకాకుళం

వైభవంగా రుక్మిణి రాధాసహిత శ్రీ కృష్ణ కళ్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట, ఫిబ్రవరి 23: మండలంలోని తొగిరి గ్రామంలో గల గోకుల కృష్ణ ఆలయం ప్రాంగాణంలో శుక్రవారం వైభవంగా కన్నుల పండువగా రుక్మిణి రాధా సహిత శ్రీ కృష్ణ కళ్యాణం నిర్వహించారు. గ్రామానికి చెందిన నేతింటి వైకుంఠరావు, నేతింటి శిమ్మయ్య దంపతులు కంకనాదారులై వివాహ వేడుకలలో పాల్గొనగా ఆలయ అర్చకులు పీసపాటి రామానుజాచార్యులు పర్యవేక్షణలో మంగళవాయిద్యాలు, నాదస్వరం, మంత్రోచ్ఛారణల మధ్య కన్నుల పండువగా ఈ కళ్యాణాన్ని గోవింద నామస్మరణలతో నిర్వహించారు. ఆలయ ప్రధమ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు నందేశ్వరరావు తెలిపారు. స్థానికులైన మాజీ జెడ్పిటీసీ నామగిరి జగన్నాద్‌దాస్ దొర, సర్పంచ్ శర్వాణి, ఎంపిటీసీ మండల టీడీపీ అధ్యక్షుడు రాఘవేంద్ర ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తొగిరి కినె్నరవాడ పురవీధులలో కోలాటం, తదితర ప్రదర్శనలతో ఉత్సవ విగ్రహాల ఊరేగింపు నిర్వహించారు.