క్రైమ్/లీగల్

డెంగ్యూ జ్వరంతో మూగుపురం యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట, సెప్టెంబర్ 20: మండలంలోని మూగుపురం గ్రామానికి చెందిన ఇసై. ప్రవీణ్ (25) డెంగ్యూ జ్వరంతో గురువారం ఉదయం విశాఖపట్నంలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. మృతుడు ప్రవీణ్ పట్ట్భద్రుడు. ఉద్యోగాల పరీక్షలకు హాజరుకావడానికి గాను గత మూడేళ్లుగా విశాఖపట్నంలో ఉంటూ కోచింగ్ పొందుతున్నాడు. వినాయకచవితి ముందు డెంగ్యూ జ్వరం సోకడంతో స్వగ్రామానికి వచ్చాడు. తల్లిదండ్రులు, గ్రామస్థులు ఈ యువకున్ని పర్లాఖిముడి, శ్రీకాకుళం రిమ్స్, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించగా డెంగ్యూ జ్వరం నిర్ధారణ అయింది. ప్లేట్ లెట్స్ సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ఉన్నత ప్రమాణాలు గల వైద్యం కోసం విశాఖపట్నంలో కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఐదు రోజుల చికిత్స అనంతరం ఈ ఉదయం మృతి చెందినట్లు మృతుని సోదరుడు రాజేష్ తెలిపారు. మృతునకు తల్లిదండ్రులు వెంకటరావు, జయమ్మ, మరో ముగ్గురు సోదరులున్నారు. యువకుడు ఆకస్మికంగా మృతి చెందడంతో ఈ కుటుంబంతో పాటు గ్రామంలో విషాధఛాయలు అలముకున్నాయి. ప్రవీణ్ మృతదేహానికి గురువారం స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి.