శ్రీకాకుళం

నష్టపరిహారం అందక గుండెపోటుతో రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మందస, నవంబర్ 20: మందస మండలం, ఉద్దానబేతాళపురం గ్రామానికి చెందిన డి.లక్ష్మినారాయణ(62) అనే రైతు మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఇటీవల తిత్లీ బీభత్సానికి రెండు ఎకరాల 13 సెంట్లు జీడి, కొబ్బరి తోటలు పూర్తిగా ధ్వంసమైనాయని, నివశిస్తున్న ఇళ్లు నేలమట్టమై ఉండడానికి కూడ గూడు లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలో కుటుంబీకులతో తలదాచుకుంటున్నాడు. తిత్లీ నష్టపరిహారం కోసం అధికారులు చుట్టు ఆన్‌లైన్ జాబితాలో పేరు నమోదు చేసేందుకు పలుమార్లు కార్యాలయాలు చుట్టు కాళ్లురిగేలా తిరిగినప్పటికి పరిహారం అందకపోవడంతో తీవ్ర నిరాశకు గురై రైతు దున్న లక్ష్మినారాయణ అస్వస్థతకు గురై మృతి చెందినట్లు భార్య దానమ్మ తెలిపారు. మృతుడుకు కుమారుడు, కుమార్తెలున్నారు. ఈ విషయాన్ని వి ఆర్ వో తహసీల్థార్ శ్యాంసుందరరావు దృష్టికి తీసుకువెళ్లారు.