జాతీయ వార్తలు

సోమనాథ్ ఆలయం వద్ద తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్: జలమార్గం ద్వారా ఉగ్రవాదులు గుజరాత్‌లో ప్రవేశించారన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో రాష్ట్రంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. శివరాత్రి సందర్భంగా సోమనాథ్ ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో అక్కడ పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసి పెద్దఎత్తున సోదాలు చేస్తున్నారు. ఈ ఆలయం వద్ద ఈరోజు సాయంత్రం నిర్వహించాల్సిన సాంస్కృతిక ఉత్సవాలను భద్రతా కారణాల రీత్యా రద్దు చేశారు. జునాగఢ్ వద్ద భావనాథ్ మాధవ ఆలయం వద్ద శివరాత్రి సందర్భంగా అయిదురోజుల పాటు జరిగే ఉత్సవాలకు భారీగా భక్తులు రావడంతో తనిఖీలు చేయడంలో పోలీసులు సతమతమవుతున్నారు. ఆలయాలకు, ఉత్సవాలకు వచ్చే భక్తులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు తెగబడితే పరిస్థితిని ఊహించలేమని భద్రతాదళం అధికారులు ఆందోళన చెందుతున్నారు.