క్రీడాభూమి

ప్రో కబడ్డీలో బెంగళూరుపై పాట్నా గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, జూలై 7: ప్రో కబడ్డీ టోర్నమెంట్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో పాట్నా పైరేట్స్ ఆరు పాయంట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. ఈ జట్టు 31 పాయంట్లు సాధించగా, బెంగళూరు 25 పాయంట్లు చేయగలిగింది. పాట్నా ఆట గాళ్లలో ప్రదీప్ నర్వార్ అందరి కంటే ఎక్కువగా ఎనిమిది పాయంట్లు చేశాడు. కుల్దీప్ సింగ్ ఏడు, రాజేష్ మోండల్ ఆరు చొప్పున పాయంట్లు సంపాదించారు. బెంగళూరు తరఫున రోహిత్ కుమార్ తొమ్మిది పాయంట్లు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పవన్ కు మార్ ఆరు పాయంట్లు సాధించాడు. పాట్నాకు ఇది నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగో విజయం కావడం విశేషం. జైపూర్ పింక్ పాంథ ర్స్, పునేరీ పల్టన్ చెరి 20 పాయంట్లతో సంయుక్తంగా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండగా, పాట్నా కూడా అనే్న పాయంట్లు సంపాదించింది. అయతే, పైన రెండు జట్లు ఆరేసి మ్యాచ్‌లు ఆడితే, పాట్నా నాలుగు మ్యాచ్‌ల్లోనే వాటి సరసన స్థానం సంపాదిం చడం గమనార్హం. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్‌తో పాట్నా ఢీ కొంటుంది. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్, యు ముంబా జట్లు తలపడతాయ.