క్రీడాభూమి

రియోలో జాతీయ పతాకం కిందే భారత బాక్సర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: బ్రెజిల్‌లోని రియోడిజనిరోలో ఆగస్టు 5న ప్రారంభమయ్యే ఒలింపిక్ గేమ్స్‌లో మన దేశానికి చెందిన ముగ్గురు బాక్సర్లు శివ్ థాపా, మనోజ్ కుమార్, వికాస్ కృష్ణన్‌లు భారత జాతీయ పతాకం కింద పాల్గొనడానికి అనుమతించారు. ప్రపంచ బాక్సింగ్ సంస్థ ఏఐబిఏ భారత బృందాన్ని జాతీయ పతాకం కింద పాల్గొనడానికి అనుమతించింది. భారత బాక్సింగ్ ఫెడరేషన్‌లో అధికారుల మధ్య కుమ్ములాటల కారణంగా ఏఐబిఏ ఫెడరేషన్‌ను సస్పెండ్ చేయడం తెలిసిందే. అయితే భారత బాక్సర్లకు కొంత రాయితీ ఇవ్వడానికి ఏఐబిఏ అంగీకరించిందని తాత్కాలిక బాక్సింగ్ సంస్థతో అనుబంధం ఉన్న అధికారి ఒకరు చెప్పారు. అంతేకాకుండా భారత బాక్సర్ల వెంట అధికారులు వెళ్లడానికి కూడా ఏఐబిఏ అనుమతించవచ్చని తెలుస్తోంది.