క్రీడాభూమి
మహిళల ఆర్చరీలో ముగిసిన పోరు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 12 August 2016
రియో డి జెనీరో, ఆగస్టు 11: రియో ఒలింపిక్స్ మహిళల ఆర్చరీలో భారత్ పోరు ముగిసింది. ప్రీ క్వార్టర్ ఫైనల్ ఎలిమినేషన్స్ వరకూ చేరుకొని, పతకాలపై ఆశలు రేపిన లైష్రామ్ బొంబాల్యా దేవి, దీపికా కుమారి కీలక పోరులో చేతులెత్తేశారు. మెక్సికో ఆర్చర్ అలెజాండ్రా వలెన్షియాను ఢీకొన్న బొంబాల్యా దేవి కొంత వరకూ పోరాడి 2-6 తేడాతో ఓటమిపాలైంది. సెమీస్ చేరేందుకు ఆమె చేసిన ప్రయత్నంలో దీపిక పదో వంతు కూడా శ్రమించలేదు. చైనీస్ తైపీకి చెందిన తాన్ యాటింగ్ చేతిలో ఆమె 0-6 తేడాతో చిత్తయింది. పతకం సాధించే సత్తావున్న దీపిక అనూహ్యంగా ప్రీ క్వార్టర్స్ నుంచే నిష్క్రమించడం అభిమానులను నిరాశ పరచింది.
చిత్రం.. దీపికా కుమారి