క్రీడాభూమి

ఆస్ట్రేలియా ‘ఎ’తో భారత్ ‘ఎ’ హోరాహోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్బేన్, సెప్టెంబర్ 9: ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న నాలుగు రోజుల అనధికార టెస్టులో భారత్ ‘ఎ’ హోరాహోరీగా పోరాడుతున్నది. తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగులకే ఆలౌటైన భారత్ ఆతర్వాత ఆస్ట్రేలియాను 228 పరుగులకే కట్టడి చేసి, రెండు పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఆసీస్ జట్టులో జో బర్న్స్ 78, పీటర్ హ్యాండ్‌కోమ్ 87 పరుగులు సాధించారు. భారత్ బౌలర్లలో వరుణ్ ఆరోన్ 41 పరుగులకు మూడు, జయంత్ యాదవ్ 44 పరుగులకు మూడు చొప్పున వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్, రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది.